ఇరాన్లో నల్లటి ఆమ్ల వర్షం.. చమురు కేంద్రాలపై వైమానిక దాడుల ప్రభావం...
దుబాయ్పై డ్రోన్ల దాడి.. అడ్డుకుంటున్న రక్షణ వ్యవస్థలు, గల్ఫ్ దేశాల్లో టెన్షన్…
హార్మోజ్ జలసంధిలో అమెరికా విధ్వంసం: ఇరాన్ మైండ్ లేయర్ల ధ్వంసం…
Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు భారీ వైమానిక దాడులు (Air Strikes) జరుపుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్ పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించడంతో సుమారు లక్ష మంది జనం నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. దుబాయ్లోని పలు భవనాలపైకి దూసుకొస్తున్న డ్రోన్లను అక్కడి రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఈ ఘోర యుద్ధంలో 1700 మంది ప్రాణాలు కోల్పోయారు.
చమురు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్లో 'బ్లాక్ రెయిన్' (నల్లటి ఆమ్ల వర్షం) కురుస్తోంది. ఇది అక్కడి ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది. హార్మోజ్ జలసంధి సమీపంలో అమెరికా తన భీకర దాడులను కొనసాగిస్తూ ఇరాన్ మైండ్ లేయర్లను ధ్వంసం చేసింది. ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూ అమెరికా దౌత్య మద్దతు కేంద్రాలపై డ్రోన్ దాడులు చేస్తోంది. పలు నగరాల్లో సైరన్ల మోతతో భయానక వాతావరణం నెలకొంది.
ఈ యుద్ధ తీవ్రతను చైనా అంతరిక్షం నుండి నిశితంగా గమనిస్తోంది. ఇరాన్పై దాడులు మరిన్ని రోజులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలపై మరియు ప్రపంచ శాంతిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరు పక్షాలు పట్టు వీడకపోవడంతో ప్రాణ నష్టం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.