Shah Rukh Khan: మళ్లీ మొదటికొచ్చిన ‘డాన్ 3’: ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ అవుట్.. కింగ్ ఖాన్ షారుక్ ఇన్? Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! AP Weather: రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు! నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్! Donald Trump: ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తూ కాదు.! రవాణా మార్గాన్ని మూస్తే సహించం! NTR: ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు: 'ఎక్స్' వేదికగా జ్ఞాపకాలను పంచుకున్న చంద్రబాబు, లోకేశ్! NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళులు! Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై రేవంత్ కీలక ముందడుగు.. మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ సిద్ధం! UAE: బక్రీద్ సందర్భంగా వేలాది ఖైదీలకు యూఏఈ క్షమాభిక్ష! Mahanadu: వర్చువల్ మహానాడుకు రికార్డు స్పందన.. 7.5 లక్షల మంది హాజరు.. సీఎం చంద్రబాబు హర్షం! Bengaluru: అంట్లు తోమడం కంటే ఆటో నడపడం మేలు.. మహిళ మాటలకు నెటిజన్ల ప్రశంసలు! Shah Rukh Khan: మళ్లీ మొదటికొచ్చిన ‘డాన్ 3’: ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ అవుట్.. కింగ్ ఖాన్ షారుక్ ఇన్? Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! AP Weather: రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు! నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్! Donald Trump: ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తూ కాదు.! రవాణా మార్గాన్ని మూస్తే సహించం! NTR: ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు: 'ఎక్స్' వేదికగా జ్ఞాపకాలను పంచుకున్న చంద్రబాబు, లోకేశ్! NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళులు! Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై రేవంత్ కీలక ముందడుగు.. మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ సిద్ధం! UAE: బక్రీద్ సందర్భంగా వేలాది ఖైదీలకు యూఏఈ క్షమాభిక్ష! Mahanadu: వర్చువల్ మహానాడుకు రికార్డు స్పందన.. 7.5 లక్షల మంది హాజరు.. సీఎం చంద్రబాబు హర్షం! Bengaluru: అంట్లు తోమడం కంటే ఆటో నడపడం మేలు.. మహిళ మాటలకు నెటిజన్ల ప్రశంసలు!

Mahanadu: 11 క్లస్టర్లలో ఉత్సాహంగా మహానాడు కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి ఆనం!

Mahanadu: ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ఈసారి ప్రత్యేక ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాలు ఆత్మకూరులో పసుపు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.

Published : 2026-05-27 20:29:00

“కార్యకర్తే అధినేత” నినాదంతో మార్మోగిన ఆత్మకూరు మహానాడు..

ఎన్టీఆర్ జయంతితో పసుపుమయమైన ఆత్మకూరు నియోజకవర్గం..

ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ఈసారి ప్రత్యేక ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాలు ఆత్మకూరులో పసుపు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో హైబ్రిడ్ విధానంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.

ఆత్మకూరు నియోజకవర్గంలోని మొత్తం 11 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈసారి “స్త్రీశక్తి” థీమ్‌తో మహానాడు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి క్లస్టర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి కార్యకర్తలకు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా సౌకర్యాలు కల్పించారు. సంగం మండలం సిద్ధిపురంలో పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్న మహానాడును కార్యకర్తలతో కలిసి వీక్షించడం ఆనందంగా ఉందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం పసుపు జెండాలతో కళకళలాడుతోందని, సభా ప్రాంగణాలు కార్యకర్తల సందడితో నిండిపోయాయని తెలిపారు. ఎక్కడ చూసినా మహానాడు సందడి కనిపిస్తూ నియోజకవర్గం మొత్తం పసుపుమయంగా మారిందన్నారు.

ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంకితభావంతో ముందుకు సాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అనంతసాగరం, ఆత్మకూరు రూరల్, మున్సిపాలిటీ, ఏఎస్ పేట, సంగం, చేజర్ల ప్రాంతాల్లో నిర్వహించిన క్లస్టర్ సమావేశాలను ఆయన స్వయంగా సందర్శించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి చోట ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి మహానాడు ప్రాముఖ్యతను వివరించారు.

నెల్లూరులో మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఇంధన సమస్యల కారణంగా పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు మంత్రి తెలిపారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1875 క్లస్టర్లలో టెక్నాలజీ సహాయంతో హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఆత్మకూరు నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో జరిగిన కార్యక్రమాలకు భారీ స్పందన లభించిందని, ఇప్పటివరకు దాదాపు 10 వేల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నట్లు మంత్రి వెల్లడించారు. “కార్యకర్తే అధినేత” అనే నినాదంతో పాటు మహిళా శక్తిని మరింత బలోపేతం చేయడమే ఈసారి మహానాడు లక్ష్యమన్నారు.

మహిళలకు రాజకీయాల్లో మరింత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో యువనేత నారా లోకేష్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై తీర్మానం చేయడం గర్వకారణమని మంత్రి ఆనం పేర్కొన్నారు. భవిష్యత్తు యువతదేనని, యువ నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు విజన్‌తో రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

ఇక ఆత్మకూరులో జరిగిన మహానాడు సమావేశాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. శ్రీధర్ గార్డెన్స్, రవితేజ కళ్యాణ మండపంలో జరిగిన క్లస్టర్ సమావేశాల్లో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎంపీ వేమిరెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసిన ఘనత కార్యకర్తలదేనని కొనియాడారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో ఆత్మకూరులో పార్టీ మరింత బలపడుతోందని, ప్రతి క్లస్టర్‌లో కనిపిస్తున్న కార్యకర్తల ఉత్సాహం ప్రజల్లో పార్టీపై ఉన్న అభిమానాన్ని చూపిస్తోందన్నారు.

చంద్రబాబు నాయుడు విజన్‌, నారా లోకేష్ యువ నాయకత్వంతో రాష్ట్ర భవిష్యత్తు మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు అవకాశాల కల్పనలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

మహానాడు తొలి రోజు కార్యక్రమాలు ఘనవిజయంగా ముగియడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో క్లస్టర్ ఇంచార్జ్‌లు, కన్వీనర్లు, మహిళా నాయకులు, యువ నాయకులు, అభిమానులు పాల్గొని కార్యక్రమాలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

Spotlight

Read More →