Earth Sun Distance: మన మూలాల్లోనే మహా విజ్ఞానం.. ఈ ఒక్క వాక్యంలోనే 300 ఏళ్ల ముందే సూర్యుడి దూరం ఎలా తెలిసింది? ఆధునిక సైన్స్‌కు సవాల్! TDP 44th Anniversary: మస్కట్ వేదికగా పసుపు పండుగ.. ప్రవాస గడ్డపై రెపరెపలాడిన టీడీపీ జెండా! Praja Vedika: నేడు (30/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Central Government: ఇంధన సరఫరాపై కేంద్రం శుభవార్త! 60 రోజుల పాటు దిగులు లేదు.. Dogs Howling: అర్ధరాత్రులు కుక్కలు ఎందుకు అరుస్తూ ఉంటాయి? అసలు విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! Tirumala: తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు మరియు దర్శన విశేషాలు! PM Surya Ghar: ఉచిత విద్యుత్ లక్ష్యం... కొవ్వాడలో 'పీఎం సూర్య ఘర్' పథకానికి శ్రీకారం చుట్టనున్న విద్యుత్ శాఖ మంత్రి! Ram Mohan Naidu: దేశంలోనే టాప్ లీడర్.. 'పవర్ ఫుల్ ఇండియన్స్' జాబితాలో కేంద్రమంత్రి! Free Bus Scheme: మహిళల ఉచిత బస్సు పథకంలో కీలక మార్పులు చేసిన సర్కార్.!! TTD 44th Anniversary: తెలుగుదేశం 44వ ఆవిర్భావ వేడుకల్లో హోరెత్తిన గుంటూరు తెలుగుయువత! Earth Sun Distance: మన మూలాల్లోనే మహా విజ్ఞానం.. ఈ ఒక్క వాక్యంలోనే 300 ఏళ్ల ముందే సూర్యుడి దూరం ఎలా తెలిసింది? ఆధునిక సైన్స్‌కు సవాల్! TDP 44th Anniversary: మస్కట్ వేదికగా పసుపు పండుగ.. ప్రవాస గడ్డపై రెపరెపలాడిన టీడీపీ జెండా! Praja Vedika: నేడు (30/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Central Government: ఇంధన సరఫరాపై కేంద్రం శుభవార్త! 60 రోజుల పాటు దిగులు లేదు.. Dogs Howling: అర్ధరాత్రులు కుక్కలు ఎందుకు అరుస్తూ ఉంటాయి? అసలు విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! Tirumala: తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు మరియు దర్శన విశేషాలు! PM Surya Ghar: ఉచిత విద్యుత్ లక్ష్యం... కొవ్వాడలో 'పీఎం సూర్య ఘర్' పథకానికి శ్రీకారం చుట్టనున్న విద్యుత్ శాఖ మంత్రి! Ram Mohan Naidu: దేశంలోనే టాప్ లీడర్.. 'పవర్ ఫుల్ ఇండియన్స్' జాబితాలో కేంద్రమంత్రి! Free Bus Scheme: మహిళల ఉచిత బస్సు పథకంలో కీలక మార్పులు చేసిన సర్కార్.!! TTD 44th Anniversary: తెలుగుదేశం 44వ ఆవిర్భావ వేడుకల్లో హోరెత్తిన గుంటూరు తెలుగుయువత!

TTD 44th Anniversary: తెలుగుదేశం 44వ ఆవిర్భావ వేడుకల్లో హోరెత్తిన గుంటూరు తెలుగుయువత!

TTD 44th Anniversary: అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచుతూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 2026-03-30 08:19:00

కేసులకు భయపడం.. ప్రజల కోసమే పోరాటం: గుంటూరు తెలుగుయువత గర్జన.

చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు: రావిపాటి సాయికృష్ణ…

అమరావతి ఏకైక రాజధాని.. చారిత్రాత్మక నిర్ణయంపై యువత హర్షం…

TTD 44th Anniversary: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి తెలుగుయువత కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో వేలాది మంది యువకులు, విద్యార్థులు బైకులు, బస్సుల్లో ఉత్సాహంగా తరలివచ్చి పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

కేంద్ర కార్యాలయంతో పాటు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో కూడా ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా సాగాయి. జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రావిపాటి సాయికృష్ణ మరియు తెలుగుయువత కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండు చోట్లా జరిగిన కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ వేడుకల సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సన్మాన కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి, అత్యధిక కేసులు ఎదుర్కొన్న నాయకులను పార్టీ గౌరవించుకుంది. ఈ క్రమంలో ధైర్యంగా పోరాడిన గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణను ఎమ్మెల్యే గల్లా మాధవి దుశ్శాలువాతో సత్కరించి, ఆయన సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం, ఆరు గ్యారెంటీ పథకాలు మరియు యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన వంటి హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కొనియాడారు. టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచుతూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి నిర్మాణంతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, యువత అంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Spotlight

Read More →