Donald Trump: 150 రోజుల తాత్కాలిక గండం! ట్రంప్ మాస్టర్ ప్లాన్ - పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! Flight Tickets: విమాన ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్...! కొత్త నిబంధనలు ఇవే! AP Government: ఏపీ సర్కార్ సరికొత్త టెక్నాలజీ.. మీ ఇంటి గుమ్మానికే 'డిజిటల్' గుర్తింపు! సమస్య ఏదైనా.. ఇక చిటికెలో పని! UPI Global: ఇజ్రాయెల్‌లోనూ మన యూపీఐ హవా...! పర్యాటకులకు పండగే పండగ! Greenfield Highway: తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ ఫాస్ట్ రహదారి..! గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్లొచ్చు..! LiquorScam: మద్యం కుంభకోణంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్...! రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు! Speaker: యువత రాజకీయాల్లోకి రావాలి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు! Lineman Recruitment: నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ఫోకస్.. లైన్‌మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.!! WebHistory: ఇంటర్నెట్ పుట్టుక వెనుక ఇంత కథ ఉందా? ఆర్పానెట్ నుండి నేటి 5G వరకు పూర్తి చరిత్ర! Blue Print: ముఖ్యమంత్రి కీలక ప్రకటన! సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో 'బ్లూ ప్రింట్'.. Donald Trump: 150 రోజుల తాత్కాలిక గండం! ట్రంప్ మాస్టర్ ప్లాన్ - పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! Flight Tickets: విమాన ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్...! కొత్త నిబంధనలు ఇవే! AP Government: ఏపీ సర్కార్ సరికొత్త టెక్నాలజీ.. మీ ఇంటి గుమ్మానికే 'డిజిటల్' గుర్తింపు! సమస్య ఏదైనా.. ఇక చిటికెలో పని! UPI Global: ఇజ్రాయెల్‌లోనూ మన యూపీఐ హవా...! పర్యాటకులకు పండగే పండగ! Greenfield Highway: తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ ఫాస్ట్ రహదారి..! గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్లొచ్చు..! LiquorScam: మద్యం కుంభకోణంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్...! రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు! Speaker: యువత రాజకీయాల్లోకి రావాలి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు! Lineman Recruitment: నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ఫోకస్.. లైన్‌మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.!! WebHistory: ఇంటర్నెట్ పుట్టుక వెనుక ఇంత కథ ఉందా? ఆర్పానెట్ నుండి నేటి 5G వరకు పూర్తి చరిత్ర! Blue Print: ముఖ్యమంత్రి కీలక ప్రకటన! సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో 'బ్లూ ప్రింట్'..

Lineman Recruitment: నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ఫోకస్.. లైన్‌మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.!!

Lineman Recruitment: విశాఖపట్నం లాంటి తీర ప్రాంత నగరాల్లో తుపానుల సమయంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికతో ముందుకెళ్తోందని మంత్రి వివరించారు.

Published : 2026-02-26 17:49:00

విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు..

లైన్‌మెన్ ఖాళీల భర్తీ త్వరలోనే..

విశాఖలో అండర్‌గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్ట్…

Lineman Recruitment: రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో లైన్‌మెన్‌ల నియామకం, విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన  సమాధానమిచ్చారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతను తీర్చడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే ఏఈల కొరతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసి, వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మూడు డిస్కమ్‌ల పరిధిలో ప్రస్తుతం సుమారు 18 వేల మంది వివిధ పద్ధతుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి తెలిపారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా తక్షణ అవసరాల కోసం కాంట్రాక్ట్  అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో సిబ్బందిని నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేసేందుకు 15,580 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ పూర్తికాగానే వారి సర్వీసులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, దీనివల్ల లైన్ల నిర్వహణ మరియు మరమ్మతుల పనుల్లో వేగం పెరుగుతుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం లాంటి తీర ప్రాంత నగరాల్లో తుపానుల సమయంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికతో ముందుకెళ్తోందని మంత్రి వివరించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విశాఖలో అత్యాధునిక 'అండర్ గ్రౌండ్ కేబుల్'  వ్యవస్థను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే భారీ గాలులు, వర్షాలు కురిసినా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగదని, ఇది నగరవాసులకు పెద్ద ఊరటనిస్తుందని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్ అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 'ఆర్డీఎస్ఎస్'  పథకం కింద భారీగా పనులు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 8 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన సభకు వివరించారు. ఈ పథకం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడమే కాకుండా, మారుమూల వ్యవసాయ కనెక్షన్లకు కూడా నాణ్యమైన కరెంటు అందుతుందని తెలిపారు.

ఆర్డీఎస్ఎస్ పనుల గడువుపై స్పందిస్తూ, వచ్చే ఏప్రిల్ నాటికి వంద శాతం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టేందుకు సిబ్బంది అవసరం ఎంతో ఉందని, అందుకే ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం వెనకాడబోదని స్పష్టం చేశారు. కేవలం నియామకాలే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూస్తామని, ప్రజలకు  రైతులకు మెరుగైన సేవలందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నొక్కి చెప్పారు.

Spotlight

Read More →