Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ ఆహారాలతో రక్తహీనతకు సులభంగా చెక్ పెట్టవచ్చు! Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! MangoCity Of India: మ్యాంగో సిటీ ఆఫ్ ఇండియా... ఇక్కడ పండే మామిడి రుచే వేరబ్బ!! Tollywood Heronie: బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడి.. యువతకు ప్రేమ పాఠాలు చెప్తున్న హీరోయిన్! ప్రేమ అనేది ఒక్కసారే కాదు.. Donald Trump: జలసంధి తెరిచి ఉంచాల్సిందే..మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్‌.. వచ్చే వారంలో ఇరాన్‌పై భీకర దాడులు? Swatch Andhra: గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి! APSRTC: తిరుపతి భక్తులకు గుడ్ న్యూస్... త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం! West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు! Indian Railways: ఇండియాలోనే లాంగెస్ట్ నాన్‌స్టాప్ రైలు జర్నీ.. 528 కిలోమీటర్ల వరకు ఒక్క స్టేషన్ కూడా ఆగదు! Kollu Ravindra: స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రలో ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి కొల్లు రవీంద్ర! Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ ఆహారాలతో రక్తహీనతకు సులభంగా చెక్ పెట్టవచ్చు! Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! MangoCity Of India: మ్యాంగో సిటీ ఆఫ్ ఇండియా... ఇక్కడ పండే మామిడి రుచే వేరబ్బ!! Tollywood Heronie: బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడి.. యువతకు ప్రేమ పాఠాలు చెప్తున్న హీరోయిన్! ప్రేమ అనేది ఒక్కసారే కాదు.. Donald Trump: జలసంధి తెరిచి ఉంచాల్సిందే..మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్‌.. వచ్చే వారంలో ఇరాన్‌పై భీకర దాడులు? Swatch Andhra: గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి! APSRTC: తిరుపతి భక్తులకు గుడ్ న్యూస్... త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం! West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు! Indian Railways: ఇండియాలోనే లాంగెస్ట్ నాన్‌స్టాప్ రైలు జర్నీ.. 528 కిలోమీటర్ల వరకు ఒక్క స్టేషన్ కూడా ఆగదు! Kollu Ravindra: స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రలో ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి కొల్లు రవీంద్ర!

Indian Railways: ఇండియాలోనే లాంగెస్ట్ నాన్‌స్టాప్ రైలు జర్నీ.. 528 కిలోమీటర్ల వరకు ఒక్క స్టేషన్ కూడా ఆగదు!

త్రివేండ్రం - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘ దూరం (528 కి.మీ) ఎక్కడా ఆగకుండా నాన్‌స్టాప్‌గా ప్రయాణించే రైలుగా రికార్డు సష్టించింది. రాజస్థాన్‌లోని కోటా నుండి గుజరాత్‌లోని వడోదర మధ్య ఈ రైలు కనీసం ఒక్క స్టేషన్‌లో కూడా ఆగకుండా గంటకు 130 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. పవర్‌ఫుల్ WAP-7 ఇంజన్ మరియు ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల సాంకేతికతతో ఈ అద్భుత ప్రయాణం సాధ్యమైంది.

Published : 2026-05-16 14:42:00

Travel- తగ్గేదేలే అంటున్న రాజధాని ఎక్స్‌ప్రెస్.. కోటా టు వడోదర మధ్య అస్సలు బ్రేకులుండవు!

9 రాష్ట్రాలు.. 2848 కిలోమీటర్ల దూరం: దేశంలోనే అత్యంత పొడవైన రూట్ కలిగిన రాజధాని ఎక్స్‌ప్రెస్.

దురంతో రికార్డు బద్దలు.. టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చిన త్రివేండ్రం-నిజాముద్దీన్ రాజధాని.

Indian Railways: సాధారణంగా రైలు ప్రయాణం అనగానే ప్రతి గంటకో, రెండు గంటలకో ఏదో ఒక స్టేషన్‌లో ఆగడం, ప్రయాణికుల హడావుడి, ప్లాట్‌ఫామ్‌లపై వ్యాపారుల అరుపులు గుర్తుకు వస్తాయి. కానీ, మన దేశంలో ఒక సూపర్ హిట్ రైలు ఉంది, అది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మధ్యలో అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది. భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘ దూరం కనీసం ఒక్క స్టేషన్‌లో కూడా ఆగకుండా, నాన్‌స్టాప్‌గా ప్రయాణించే నెంబర్ వన్ రైలుగా 'త్రివేండ్రం - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్' సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ రైల్వేస్ సాధించిన సాంకేతిక ప్రగతికి ఈ రైలు ఒక మకుటాయమానంగా నిలిచింది.

రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క అతిపెద్ద స్పెషాలిటీ ఏమిటంటే, రాజస్థాన్‌లోని 'కోటా' స్టేషన్‌లో ఎక్కిన ప్యాసింజ‌ర్ల‌కు మళ్లీ గుజరాత్‌లోని 'వడోదర' వచ్చే వరకు ఎక్కడా బ్రేక్ ఉండదు. ఈ రెండు ప్రధాన స్టేషన్ల మధ్య ఉన్న 528 కిలోమీటర్ల భారీ దూరాన్ని ఈ రైలు కనీసం ఒక్క నిమిషం కూడా ఆగకుండా కేవలం 6 నుండి 7 గంటల్లోనే దాటేస్తుంది. మనం సొంత కార్లలో వెళ్తేనే మధ్యలో కాఫీ, టీల కోసం ఆపుతాం, కానీ ఈ రైలు మాత్రం ప్రయాణికుల కోసం ఎక్కడా స్పీడ్ తగ్గించకుండా నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తుంది. గతంలో ఈ రికార్డు ముంబై-అహ్మదాబాద్ మధ్య 493 కిలోమీటర్లు ఆగకుండా నడిచిన 'ముంబై-హాపా దురంతో ఎక్స్ప్రెస్' పేరిట ఉండేది.

కేరళ రాజధాని తిరువనంతపురం (త్రివేండ్రం) నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఈ రైలు ప్రయాణించే మొత్తం దూరం 2,848 కిలోమీటర్లు. ఇండియాలోనే అత్యంత పొడవైన రూట్ కలిగిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా కూడా ఇది గుర్తింపు పొందింది. ఈ లాంగ్ జర్నీలో ఈ రైలు ఏకంగా తొమ్మిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే నడిచే ఈ రైలు, ముఖ్యంగా 'కొంకణ్ రైల్వే' రూట్‌లోకి ప్రవేశించగానే ప్రయాణికులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, అందమైన కొండలు, పెద్ద వంతెనలు, చీకటి సొరంగాల గుండా రైలు వెళ్తుంటే కిటికీ పక్కన కూర్చొని చూడటం మరుపురాని అనుభవంగా మారుతుంది.

అంత దూరం రైలు ఆగకుండా వెళ్తే ఇంజన్‌కు రెస్ట్ అవసరం లేదా, నీళ్లు నింపక్కర్లేదా అనే సందేహం ఎవరికైనా రావచ్చు. అక్కడే ఉంది రైల్వే వారి సాంకేతిక మ్యాజిక్. ఈ రైలు కోసం అత్యంత ఆధునికమైన, పవర్ఫుల్ 'WAP-7' ఎలక్ట్రిక్ ఇంజన్లను మరియు వేగంగా ప్రయాణించే అత్యంత సురక్షితమైన 'ఎల్హెచ్బి (LHB) కోచ్లను' వాడుతున్నారు. అందువల్ల వడోదర - కోటా మధ్య దీనికి ఎలాంటి విరామం అవసరం ఉండదు. గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఈ రైలుకు ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అప్‌గ్రేడ్ అయిందో చెప్పడానికి ఈ నాన్‌స్టాప్ జర్నీ ఒక నిదర్శనం.

ఇండియన్ రైల్వేస్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు ఇచ్చే ప్రాధాన్యత మరియు మర్యాదే వేరు. ఈ రైలు వస్తుందంటే చాలు, దీని వేగానికి ఎక్కడా ఆటంకం కలగకుండా ఉండేందుకు పక్క ట్రాక్‌లపై ఉన్న మిగతా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను కూడా లూప్ లైన్లలో ఆపేస్తారు. దీనికి మాత్రం రూట్ క్లియర్ చేస్తూ వరుసగా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఒకే రన్‌లో 528 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా వెళ్లడం అనేది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, మన భారతీయ రైల్వే వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఎంత పటిష్టంగా మారిందో చెప్పడానికి ఒక గర్వకారణమైన ఉదాహరణ.

Spotlight

Read More →