Header Banner

పాక్ పౌరుల బహిష్కరణకు తాత్కాలిక బ్రేక్‌! కేంద్రం కీలక నిర్ణయం!

  Thu May 01, 2025 13:09        India

భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీ పౌరులను వెనక్కి పంపే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని దేశం విడిచి వెళ్లేందుకు విధించిన ఏప్రిల్ 30 గడువును సవరించింది. తదుపరి ఆదేశాలు జారీచేసేంత వరకు పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు గుండా పాకిస్థానీయులు తమ స్వదేశానికి వెళ్లేందుకు అనుమతిని కొనసాగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సరిహద్దు వద్ద చిక్కుకుపోయిన వందలాది పాక్ పౌరులు, వారి కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది. పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత్‌లో ఉన్న పాకిస్థానీ పౌరులు ఏప్రిల్ 30 లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని గతంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సరిహద్దును మూసివేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఆకస్మిక ఆదేశంతో అనేక కుటుంబాలు, ముఖ్యంగా భారతీయులను వివాహం చేసుకున్న పాక్ జాతీయులు, దీర్ఘకాలిక వీసాల కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తమను బలవంతంగా వేరు చేస్తున్నారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వాపోయారు. భారతీయుడిని వివాహం చేసుకుని, వీసా మార్పు కోసం ఎదురుచూస్తున్న పాక్ జాతీయురాలు సమీరన్, "నా తప్పేంటి? మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు?" అని ప్రశ్నించారు. బస్సులో మరణించిన వృద్ధుడు ఈ గడువు కారణంగా అట్టారీ సరిహద్దు వద్ద తీవ్ర అనిశ్చితి, భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్ 30న ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. 1980 నుంచి భారత్‌లో నివసిస్తున్న 80 ఏళ్ల పాకిస్థానీ పౌరుడు అబ్దుల్ వహీద్ భట్, తనను వెనక్కి పంపే ప్రక్రియ కోసం బస్సులో వేచి చూస్తుండగా మరణించారు. ఈ ఘటన బహిష్కరణ ప్రక్రియ వృద్ధులపై చూపుతున్న శారీరక, మానసిక ప్రభావాన్ని ఎత్తిచూపుతోంది.

సరిహద్దు దాటిన 237 మంది పాక్ పౌరులు గత వారం రోజుల్లో అట్టారీ సరిహద్దు నుంచి 237 మంది పాకిస్థానీ పౌరులను వెనక్కి పంపినట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ చివరి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 537 మందిని స్వదేశానికి పంపించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ నుంచి భారత పౌరులు కూడా స్వదేశానికి తిరిగి వచ్చారు. వైద్య వీసాలు ఉన్నవారికి మొదట్లో మినహాయింపు ఇచ్చినా, ఇతర కేటగిరీలకు చెందిన అనేక మంది ఈ ఆదేశాల వల్ల ఇబ్బంది పడ్డారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం శాఖ గడువును నిలిపివేయడంతో ప్రభావిత కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. తదుపరి ఆదేశాల కోసం వారు వేచి చూస్తున్నారు. అయితే, సరిహద్దుకు ఇరువైపులా ఉన్న అనేక మంది భవిష్యత్తుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇది కూడా చదవండి: జగన్ హెలికాప్టర్ ధ్వంసం ఘటనపై కేసు నమోదు! అజ్ఞాతంలోకి పోయిన మాజీ ఎమ్మెల్యే!
 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PakistanNationals #IndiaPakistanBorder #DeportationHalt #AttariBorder #IndianGovtDecision #HumanitarianRelief