ఎరువుల బ్లాక్ మార్కెట్పై సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల సరఫరా, ధరలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో సీఎస్, డీజీపీతో పాటు వ్యవసాయ, విజిలెన్స్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం, ధరలు పెంచే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
యూరియా వ్యవసాయేతర పనులకు మళ్లకుండా విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ఎవరైనా పక్కదారి పట్టిస్తే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ప్రైవేటు డీలర్లకు కోటా తగ్గించి, ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చూసే బాధ్యత అధికారులదేనని సీఎం పునరుద్ఘాటించారు.