కూటమి ప్రభుత్వ లక్ష్యం అదే.. మంత్రి కీలక వ్యాఖ్యలు! అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..
Tue May 27, 2025 21:53 Politics
భారతదేశంలో అమలవుతున్న ప్రమాణాలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రామాణికంగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దేశంలో నాణ్యత పరిరక్షణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జరిగిన బీఐఎస్ 9వ పాలక మండలి సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో బీఐఎస్ అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. 2014-15 సంవత్సరంలో భారతదేశంలో కేవలం 2,000 ప్రమాణాలు మాత్రమే ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 23,000లకు చేరిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఈ ప్రమాణాల సంఖ్యను 55,000 వరకు పెంచడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భారత్ రూపొందించిన ప్రమాణాలలో 95 శాతం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమన్వయం (హార్మొనైజ్డ్) చేయబడ్డాయని, దీంతో భారత స్టాండర్డ్లు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు!
బంగారం హాల్మార్కింగ్ విషయంలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఇప్పటివరకు దేశంలోని 371 జిల్లాల్లో బంగారం హాల్మార్కింగ్ విధానం అమలులో ఉందని, దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ హాల్మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. త్వరలోనే బులియన్ (బంగారు కడ్డీలు) హాల్మార్కింగ్ను కూడా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అదేవిధంగా, వెండి ఆభరణాల హాల్మార్కింగ్కు సంబంధించి విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనిపై కూడా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. భారతదేశంలో ప్రమాణాల పరిరక్షణ, నాణ్యత నియంత్రణ, వినియోగదారుల న్యాయ హక్కుల పరిరక్షణలో బీఐఎస్ పోషిస్తున్న పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
లోకేశ్కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!
వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..
ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.