వేయి కిలోల స్టీల్తో అమరావతి అక్షర రూపం! ఫైబర్గ్లాస్తో మోదీ విగ్రహం!
Thu May 01, 2025 18:32 Politics.202505019870.jpg)
అమరావతి పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మే రెండో తేదీన పనులను పునఃప్రారంభిస్తారు. అమరావతి పునరుజ్జీవానికి గుర్తుగా భారీ అక్షర రూపం, విగ్రహాలు సిద్ధమయ్యాయి. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ కళాఖండాలను రూపొందించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పేర్లతో పాటు బుద్ధుడు, మేక్ ఇన్ ఇండియా సింహం, ఎన్టీఆర్ విగ్రహాలు కొలువుదీరనున్నాయి. ప్రధానమంత్రి మోదీ సభ వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నారు.
అమరావతి పునఃప్రారంభం కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. మే రెండో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి పునరుజ్జీవాన్ని ప్రతిబింబించేలా భారీ అక్షర రూపం, విగ్రహాలు సిద్ధమయ్యాయి. అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ వద్ద వీటిని ప్రదర్శించనున్నారు. అమరావతి అక్షర రూపాన్ని, ఇతర విగ్రహాలను తెనాలికి చెందిన కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర అనే శిల్పులు రూపొందించారు. ఓ వైపు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లు, మరో వైపు గౌతమ బుద్ధుడు, మేక్ ఇన్ ఇండియా సింహం విగ్రహాలతో పాటుగా, ఎన్టీఆర్ విగ్రహాలను ఉంచారు.
ఇది కూడా చదవండి: క్రీడాకారులకు గుడ్న్యూస్! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ విడుదల!
ఈ కళాఖండం తయారీ కోసం ఇనుప స్క్రాప్, స్టెయిన్లెస్ స్టీల్, ఫైబర్గ్లాస్ ఉపయోగించారు. ఈ చిహ్నం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం , రాజకీయ ప్రయాణాన్ని తెలియజేస్తుందని శిల్పులు చెప్తున్నారు. కాటూరి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు రవిచంద్ర ఈ విగ్రహం తయారీలో పాలుపంచుకున్నారు. గౌతమ బుద్ధుడి విగ్రహంతో పాటుగా, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాల కోసం 1.5 టన్నుల ఇనుప స్క్రాప్ ఉపయోగించారు. అలాగే అమరావతి అక్షరాల కోసం 1,000 కిలోలు , ‘మేక్ ఇన్ ఇండియా’ సింహానికి 100 కిలోల స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించినట్లు శిల్పులు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విగ్రహం కోసం ఫైబర్ గ్లాస్ ఉపయోగించినట్లు వివరించారు. కాటూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 30 మంది శిల్పులు 20 రోజుల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు.
అమరావతిలో ప్రధాని పర్యటన
మరోవైపు అమరావతిలో ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అమరావతి పునఃప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రులు తెలిపారు. అమరావతి ప్రారంభోత్సవం ఏర్పాట్లను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం పరిశీలించారు. అనంతరం మాట్లాడిన మంత్రులు.. శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి చేరుకుంటారని తెలిపారు. మరోవైపు అమరావతి పునఃప్రారంభోత్సవం కోసం సభా ప్రాంగణం పూర్తి అయ్యింది. పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రధాని మోదీ సభకు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది వరకూ వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AmaravatiSculpture #SteelArt #ModiStatue #FiberglassSculpture #AmaravatiLandmark #CreativeIndia
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.