Good News: వారందరికి గుడ్ న్యూస్! ఒక్కొకరికి రూ.25,000 ప్రకటించిన ప్రభుత్వం!

హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలను అనుసంధానించే హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రైళ్లు గంటకు 350 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే, ప్రస్తుతం 12–13 గంటలు పడుతున్న ప్రయాణం కేవలం మూడు గంటల్లో పూర్తవుతుంది. దేశంలోని ఆర్థికాభివృద్ధి, వ్యాపారం, విద్య, ఐటీ రంగాలకు ఈ బుల్లెట్‌ రైళ్లు కీలక భూమిక వహించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 580 కి.మీ మేర ఈ కారిడార్లు ఉండనున్నాయి.

Free Bus: స్త్రీ శక్తి పథకంలో బిగ్ అప్‌డేట్! ఇకపై గుర్తింపు కార్డులతో పనిలేదు.. త్వరలోనే వస్తున్న స్మార్ట్ కార్డులు!

ఇప్పటికే హైదరాబాద్‌–ముంబై హైస్పీడ్‌ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్) రైల్వే బోర్డుకు చేరింది. ఈ మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉండగా, తెలంగాణ పరిధిలో 170 కి.మీ దూరం ఉంటుంది. హైదరాబాద్‌, జహీరాబాద్‌లలో స్టేషన్లు ప్రతిపాదించారు. కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం రాగానే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరోవైపు చెన్నై, బెంగళూరు మార్గాల తుది సర్వే పనులు జరుగుతున్నాయి. రైల్వే అనుబంధ సంస్థ రైట్స్ ప్రాథమిక అలైన్‌మెంట్‌ను రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది మార్గం ఖరారు అవుతుంది.

New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల లిస్ట్ రెడీ! వచ్చే వారం నుంచే పంపిణీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

హైదరాబాద్‌–చెన్నై మార్గానికి సంబంధించి కాజీపేట, నల్గొండ మీదుగా ఉన్న పాత రైలు మార్గాలను, జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65ను పరిశీలిస్తున్నారు. అయితే బుల్లెట్‌ రైలు మార్గాలను పూర్తిగా కొత్తగా, గ్రీన్‌ఫీల్డ్ పద్ధతిలో నిర్మిస్తారు. ఈ మార్గాల్లో సాధారణ రైళ్లు కాకుండా కేవలం బుల్లెట్‌ రైళ్లు మాత్రమే నడుస్తాయి. దీంతో భవిష్యత్తులో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ కారిడార్లు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా సులభంగా కనెక్టివిటీని కల్పిస్తాయి.

Framers: రైతులకు భారీ ఆర్థిక సాయం! ఎకరాకు రూ.10 వేలు ... ఎందుకంటే?

ఈ ప్రాజెక్టులు విజయవంతంగా అమలు అయితే, హైదరాబాద్‌ వాణిజ్యరంగంలో మరింత కీలక స్థానాన్ని సంపాదించనుంది. విద్య, వ్యాపారం, ఐటీ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని రైల్వే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి మూడు ప్రధాన నగరాలకు బుల్లెట్‌ రైళ్లు కేవలం మూడు గంటల్లో చేరే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇది ప్రయాణికులకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా, దేశ ఆర్థిక వృద్ధిలో కూడా హైదరాబాద్‌ పాత్రను బలపరుస్తుంది.

DSC 2025: ఏపీలో డీఎస్సీ–2025 మెరిట్ లిస్ట్ విడుదల! ఆగస్ట్ 21 నుంచి...

సాంకేతికంగా అత్యాధునికంగా రూపొందిస్తున్న ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులు రాబోయే సంవత్సరాల్లో రవాణా రంగాన్ని పూర్తిగా మారుస్తాయని అంచనా. సమయం ఆదా కావడంతోపాటు, వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు కూడా వీటి ద్వారా అవకాశం లభిస్తుంది. దీని వలన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Schools: బాంబు బెదిరింపులతో ఢిల్లీ స్కూళ్లలో కలకలం..! విద్యార్థుల తరలింపు, విస్తృత తనిఖీలు!
National Highway: కొత్తగా నేషనల్ హైవే! రూ.11000 కోట్లతో.. 20 నిముషాల్లో ఎయిర్ పోర్ట్!
8th Pay Commission: బంపర్ ఆఫర్‌! ఉద్యోగులకు ఊహించని రీతిలో జీతాల పెంపు, డీఏ!
Kakinada Pesarattu: అబ్బబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇది ఏమిటి అనుకుంటున్నారా... కాకినాడ పెసరట్టండోయ్.. తయారీ విధానం!
Visas Cancelled: అమెరికాలో 6000 అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు.. భయాందోళనల్లో స్టూడెంట్స్!
Praja Vedika: నేడు (21/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!