ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తన అభిమాని బద్రిస్వామి కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసిన వెంటనే, వెంటనే స్పందించిన బాలయ్య చికిత్స కోసం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నారు.
వైద్యుల ప్రకారం చికిత్సకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని తేలింది. ఆర్థికంగా వెనుకబడి చికిత్సకు నోచుకోలేని పరిస్థితిలో ఉన్న బద్రిస్వామి విషయాన్ని ఆదోని బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
బాలకృష్ణ వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షల విలువైన ఎల్ఓసీ (Letter of Credit) మంజూరు చేయించారు. ఈ సహాయ పత్రాన్ని బాలయ్య సతీమణి వసుంధర బాధిత కుటుంబానికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన మానవతా సేవకు అభిమాని కుటుంబం, అభిమాన సంఘం సభ్యులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.