Header Banner

ప్రయాణికులకు అలర్ట్! ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి 100 విమానాలు రద్దు!

  Mon May 12, 2025 09:58        India

భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. దీని ప్రభావంతో, ఆదివారం ఒక్కరోజే దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన సుమారు 100 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ పరిణామం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.



భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన దృష్ట్యా, ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన విషయం విదితమే. ఈ క్రమంలో, దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్యకాలంలో రద్దయిన విమానాల్లో 96 దేశీయ సర్వీసులు ఉండగా, ఒక అంతర్జాతీయ సర్వీసు కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!



ఈ పరిణామాలపై దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (DIAL) స్పందిస్తూ, దిల్లీ విమానాశ్రయం సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. అయితే, గగనతల డైనమిక్స్‌లో చోటుచేసుకున్న మార్పులు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా కొన్ని విమానాల ప్రణాళికలు (షెడ్యూళ్లు) మరియు భద్రతా తనిఖీ కేంద్రాల ప్రాసెసింగ్ నియమాల్లో మార్పులు సంభవించే అవకాశం ఉందని వివరించింది. 



ఈ భద్రతా చర్యలు 'ఆపరేషన్ సిందూర్‌' లో భాగంగా కొనసాగుతున్నాయని, ప్రయాణికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని, ప్రయాణికులు తమ విమాన సర్వీసుల సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.

 

ఇది కూడా చదవండి: వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi ##IndiaPakistanTension #FlightCancellations #AirportSecurity #OperationSindoor #DelhiAirport