విజయవాడ, ప్రధాన ప్రతినిధి: ముఖ్యమంత్రి వైయస్ జగన్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ఆదివారం విజయవాడలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజందరు ఈ ప్రభుత్వ బాధితులేనన్నారు. ప్రస్తుతం సీఎం వైయస్ జగన్ వేదికల మీదకు వచ్చి నా బీసీలు అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీసీ అనేది ఆయన పెదాలపై నుంచి వస్తుందే తప్ప సీఎం జగన్ గుండెల్లో నుంచి మాత్రం కాదని వ్యంగ్యంగా అన్నారు. బీసీలపై కనీస సానుభూతి కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఈ సీఎంను కొనసాగించడం అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఈ సీఎం వైయస్ జగన్ అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రెండు లక్షల రూపాయిల అప్పు ఉందని ఈ సందర్బంగా పురందేశ్వరి గుర్తు చేశారు.
ఇంకా చదవండి: ఆ విషయంలో తెలుగుదేశం, జనసేన తో పాటు ఏ పార్టీ చేర్చుకొని వ్యక్తిగా నేను పోరాడుతా! RRR
ఇవి చాలక సచివాలయం, రాష్ట్రంలోని గనులను కూడా తనఖా పెడతున్నారని ఆందోళన వ్యక్తం చేశాు. అయితే ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా? అంటూ వైసీపీ నాయకుడు అడుగుతున్నారని, ఇదేం చోద్యమో అర్థం కావడం లేదన్నారు. ప్రజాధనంతో నిర్మించిన సచివాలయాన్ని తనఖా పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారని,. ప్రభుత్వ పెద్దలను ఈ సందర్భంగా ఆమె సూటిగా ప్రశ్నించారు. సుపరిపాలన అందిస్తారని ప్రజలు మీకు అధికారం అప్పగించారని.. కానీ అడ్డగోలుగా దోచుకుని ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టమని కాదని ప్రభుత్వ పెద్దలకు హితవు చెప్పారు. ప్రతిపక్ష నేతగా మద్య నియంత్రణ అన్న వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని ఏరులై పారిస్తున్నారంటూ మండిపడ్డారు. వైసిపి నాయకుల ధన దాహానికి మహిళలు వితంతువులుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా చదవండి: జనసేన కమిటీ సభ్యులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!
పిల్లలకు తండ్రి లేనివారిగా మార్చడమే కాకుండా పేదల బతుకులు సైతం నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని మద్యం వల్లే లక్షలాది మంది ఆస్పత్రులు పాలైనట్లు అనేక మంది వైద్యులు నిర్ధారించారని గుర్తు చేశారు. ఈ ఛిద్రమైన జీవితాలకు ఎవరు సమాధానం చెబుతారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం చేసిన మోసాలు, జరిగిన అవినీతిని ప్రజలకు వివరిస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.
వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా బాధితులే : వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఎన్నికల ముంగిట నా బీసీ అంటూ సీఎం జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్ పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. బీసీలపై కనీస సానుభూతి లేని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కొనసాగడం అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2 లక్షల రుణ భారం ఉందన్నారు. ఇవన్నీ చాలవన్నట్టుగా సచివాలయం, రాష్ట్రంలో గనులు కూడా తనఖా పెడుతున్నారని విమర్శించారు. పైగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మద్యం నియంత్రణ అని చెప్పి ఏరులై పారించారని ధ్వజమెత్తారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: