అంతర్జాతీయ విద్యార్థులు, కార్మికుల వలసలు రికార్డు స్థాయికి చేరుకోవటంతో ఆస్ట్రేలియా నియంత్రణ చర్యలకు దిగింది. ‘స్టూడెంట్ వీసా’ నిబంధనల్ని కఠినతరం చేయబోతున్నది. మారిన నిబంధనల్ని అమల్లో తీసుకొచ్చేందుకు ఆస్ట్రేలియా చర్యలు చేపట్టింది. ఈ కొత్త రూల్స్ మార్చి 23, 2024 నుండి అమలులోకి రానున్నట్లు ఆ దేశ హోం మంత్రి క్లారి ఓ నీల్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు.
దేశంలో ‘రెంటల్ మార్కెట్’ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నదని, దీంతో స్టూడెంట్ వీసా నిబంధనల్ని కఠినతరం చేసేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసే ఉద్దేశంతో వస్తున్న అంతర్జాతీయ విద్యార్థులను అడ్డుకునేందుకు ‘జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్’ను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. విజిటర్స్ వీసాలపై వచ్చే వారికి షరతులు విధించనున్నామని అన్నారు. ఆ దేశానికి ఏటా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధిక మంది ఇండియా, చైనా, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందినవారే ఉన్నారు అని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొత్తగా అమలులోకి రానున్న రూల్స్:
ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్లు: తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసా కోసం అవసరమైన IELTS స్కోర్ 6.0 నుండి 6.5కి పెంచబడింది. అదే సమయంలో, సాధారణ విద్యార్థి వీసా కోసం ఈ స్కోర్ 5.5 నుండి 6.0కి పెరిగింది. అలాగే ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ చెల్లుబాటు వ్యవధిని ఏడాదికి తగ్గించారు.
సేవింగ్స్: విద్యార్థి వీసాకు అర్హత పొందేందుకు అవసరమైన పొదుపు మొత్తం సుమారు $24,500 (సుమారు రూ. 20 లక్షలు)కి పెంచబడింది.
ప్రభుత్వ నివేదికల ప్రకారం, 2022లో 100,009 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. ఈ సంఖ్య గత సంవత్సరాల కంటే చాలా ఎక్కువ. ఈ కొత్త వీసా నిబంధనలు భారతీయ విద్యార్థుల వీసా రేటుపై ప్రభావం చూపవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!!
ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి
దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!!
పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ??
ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !!
నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి