హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

బొప్పూడి సభ విజయంతో జగన్ అండ్ కో లో వణుకు!! నభూతో నభవిష్యత్!! బొండా ఉమా విశ్లేషణ

2024-03-18 06:03:00

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  విలేఖరుల సమావేశం వివరాలు.
బొప్పూడి  సభ విజయవంతంతో జగన్ అండ్ కో లో వణుకు
- బొప్పిడిలో జన సునామీ వచ్చిందా?
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

బొప్పిడిలో జన సునామీ వచ్చిందా అనేలా ప్రజా గళం సభ ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం...

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చిలకలూరిపేట వద్ద బొప్పూడిలో జరిగిన ప్రజాగళం మహాసభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో సభను ఎవరూ నిర్వహించలేదు.. చూడలేదు. 300 ఎకరాల్లో సభకు ఏర్పాటు చేసినా స్థలం చాలక కిలోమీటర్ల పొడవునా 3 రెట్లు ప్రజలు బయటే ఉండిపోయారు. సభా స్థలానికి అటు, ఇటు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సభకు హాజరైన జనసంద్రాన్ని చూసి ప్రధాని మోడీ గారు కూడ ఆశ్చర్యపోయారు. ఈ జనసంద్రం జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. సభకు హాజరైనవారి లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, జోష్ ని గమనించిన ప్రధాని దానిపై కూడా వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ఫైబర్ నెట్ బరితెగింపుపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు!! కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు!!

లక్షలాదిమంది ప్రజల సాక్షిగా.. ఎన్నికల తరువాత రానున్న ఐదు సంవత్సరాలు నవ్యాంధ్ర భవిష్యత్తుకు చాలా కీలకమని.. డబుల్ ఇంజిన్ సర్కార్ తోడ్పాడుతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని.. రాష్ట్రానికి ప్రజలకు కేంద్రంలో మూడోసారి ఏర్పడనున్న ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు తాను కూడా అండగా ఉంటానని ప్రధాని హామీ ఇవ్వటం రాష్ట్ర ప్రజలకు ఎంతో ఊరటను, సంతోషాన్ని, విశ్వాసాన్ని కలుగజేసింది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మోదీగారు తీవ్ర వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధికి పూర్తి వ్యతిరేక వాతావరణం నెలకొందని ప్రధాని వ్యాఖ్యానించటంతో జగన్ క్యాంప్ లో కలవరం రేగింది. దీంతో జగన్ బృందం అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ ఐదేళ్లుగా రాష్ట్రంలో పరిపాలన కనుమరుగై.. మంత్రులంతా అవినీతిలో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారని రాష్ట్రంలో జరుగుతున్న దోపిడిపై ప్రధాని నిశితమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో మునుపటి కంటే ఎక్కువగా బలపడిన ఎన్డీఏ.. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపులో 400కు పైగా లోక్ సభ సీట్లను సాధిస్తుందన్న నమ్మకాన్ని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేయటం.. ఆ దిశగా రాష్ట్రంలో సీట్లన్నీ ఎన్డీఏ కే దక్కుతాయని ఆయన చెప్పటంతో జగన్ క్యాంప్ లో వణుకు చెలరేగింది. రాష్ట్రంలతో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి కనీసంగా 165 సీట్లు గెలుస్తుందన్న నమ్మకం మా కూటమికి ఉంది. నేటి ప్రజాగళం సభ సూపర్ హిట్ అవటంతో జగన్ బృందం హతాసులయ్యారు.

చంద్రబాబు ఆదేశాలతో పవన్ కోసం పని చేస్తా!! పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ!

ఈ విజయం రానున్న ఎన్నికల్లో కూటమి సృష్టించనున్న ప్రభంజనానికి పూర్తి సంకేతం. మేదరమెట్ల సిద్ధం సభ లో.. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఎంతో మేలు చేశానని చెప్పుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. అయినా ఓడిపోయినా పర్వాలేదు అని నిర్వేదంతో మొదటి ముందస్తు ఓటమి సంతకం చేశారు. శనివారం నాడు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తూ.. 81 శాసనసభ అభ్యర్థులను, 18 మంది లోక్ సభ అభ్యర్థులను మార్చవలసి వచ్చిందని తెలిపి రెండోసారి ముఖ్యమంత్రి ముందస్తు సంతకం చేసి.. రానున్న ఎన్నికల్లో అనివార్యమైన కూటమి భారీ విజయాన్ని ఆయనే అంగీకరించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో జగన్ బృందం విచక్షణ మరచి ఉన్నవి లేనివి మాట్లాడి తమ నైరాశ్యాన్ని తామే ఎత్తిచూపుకుంటున్నారు. ఈ ఐదేళ్లలో జగన్ రాష్ట్రానికి ఏం చేశారో, ఏం తెచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జగన్ కు సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి:

రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు - రావణ సంహారం జరుగుతుంది!!  ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం

ఈసీ (EC) తొలివేటు!! ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు!!

జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే !! ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం

చిలకలూరిపేటలో సభపై ప్రధాని మోదీ ట్వీట్! కీలక వ్యాఖ్యలు!

సభ అనంతరం చంద్రబాబు పవన్ తో మోడీ భేటీ! బాబు అరెస్టు ఆరోగ్యం పై ఆరా!

ఏపీ ఫైబర్ నెట్ బరితెగింపుపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు!! కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు!!

ఓటర్ల కోసం ప్రత్యేక యాప్!! ఒక్క మెసేజ్ చాలు 100 నిమిషాల్లో మీ ముందు!

Evolve Venture Capital  

రెండోసారి ఓటు వేయడానికి వస్తే కేస్!! సూర్యాస్తమయం తర్వాత నో ఎంట్రీ!! సీఈసీ!

ఎన్నికల సంవత్సరంగా 2024!! ప్రపంచ చూపంతా భారత్ వైపే!! మాకు సవాల్... సీఈసీ

ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →