ఈవీఎంలపై నిరాధారమైన ఆరోపణలను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఈవీఎంలపై విశ్వాసాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్దానం
ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వినియోగంపై పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరణ
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై దాదాపు 40 సార్లు విశ్వాసం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానాలు
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈవీఎంలపై తమకున్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం రెండు రిట్ పిటిషన్లను కొట్టివేసింది. 19 లక్షల ఈవీఎంలు తప్పిపోయాయన్న పిటీషన్ తో పాటు, ఎన్నికలను నిర్వహించడానికి బ్యాలెట్ పేపర్ను ఉపయోగించాలన్న మరో పిటిషన్ ఇందులో ఉన్నాయి. తప్పిపోయిన ఇవిఎంల అంశంపై తీర్పునిస్తూ, పిటీషనర్ భయాలు, ఆరోపణలను పూర్తిగా నిరాధారమని పేర్కొంది, తద్వారా భారత ఎన్నికల కమిషన్కు అనుకూలంగా కేసు మూసివేసింది. 2016-19 మధ్య కాలంలో ఇసిఐ కస్టడీ నుండి తప్పిపోయిన 19 లక్షల ఇవిఎంలను రాబోయే లోక్సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తారుమారు చేయడానికి ఉపయోగించవచ్చని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేసారు.
రాష్ట్రం కోసం సీటు పోయిన పర్లేదు! జవహర్, కొమ్మలపాటి, కళ, వనమాడి! చంద్రబాబు భేటీ తరువాత!!
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 61ఎని పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్తో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరో పిటిషన్ను స్వీకరించడానికి నిరాకరించిన జస్టిస్ ఖన్నా, ఈవీఎంల పనితీరుకు సంబంధించిన వివిధ అంశాలపై 10కి పైగా కేసులను పరిశీలించారు. గత దశాబ్దాలుగా దాదాపు 40 తీర్పులతో అత్యున్నత న్యాయస్థానాలు ఇసిఐ, ఇవిఎంల పారదర్శక ప్రక్రియ, కఠినమైన పరిపాలనా ప్రోటోకాల్లపై తమ విశ్వాసాన్ని ఉంచాయి. తద్వారా భారతదేశంలో ఇవిఎంలకు అనుకూలంగా అభివృద్ధి చెందుతున్న న్యాయశాస్త్రానికి అపారమైన విలువ, బలాన్ని జోడించాయి. వివిధ ఇవిఎంల పరిశీలన ద్వారా, భారత ఎన్నికల కమిషన్కు అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీం కోర్ట్, హైకోర్టుల ఉత్తర్వులు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి.
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
ఇటీవల ఒక కేసులో (మధ్యప్రదేశ్ జన్ వికాష్ పార్టీ వర్సెస్ భారత ఎన్నికల సంఘం, స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) 16870/ 2022, సెప్టెంబర్, 2022) సుప్రీం కోర్టు పిటీషనర్ కు రూ. 50,000 జరిమాన విధించింది. దేశంలో దశాబ్దాలుగా ఈవీఎంలు ఉపయోగించబడుతున్నాయని, అయితే ఎప్పటికప్పుడు సమస్యలను లేవనెత్తాలని పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని స్ఫష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు కూడా అలాంటి ఒక పిటిషన్పై (సి ఆర్. జయ సుకిన్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా & ఇతరులు, రిట్ పిటిషన్ (సివిల్) 6635/2021, ఆగస్ట్ 2021) రూ.10,000 జరిమాన విధించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు), వీవీప్యాట్ల కోసం కొనసాగుతున్న ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఎన్సీఆర్ కోర్టు వెలువరించిన తీర్పులో, ప్రస్తుత విధానాల యొక్క దృఢత్వం, పారదర్శకతను నొక్కిచెప్పింది. పిటిషనర్ వాదనలను తిరస్కరించింది. ఇవిఎం మాన్యువల్, స్టేటస్ పేపర్, ప్రెజెంటేషన్, వాటి 40 ఏళ్ల ప్రయాణంపై స్మారక పుస్తకం, చట్టపరమైన చరిత్ర, సంబంధిత ప్రక్రియలు, భద్రతలపై సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచడంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ముందంజలో ఉంది.
ఇవి కూడా చదవండి:
"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!!
కమ్మవారి ప్రత్యేక కార్పొరేషన్కు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!!
బీఆర్ఎస్కు వరసగా ఎదురుదెబ్బలు!! పార్టీ వీడుతున్న నాయకులు!!
రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ!! చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్!!
ఓటమిని ముందే ఒప్పుకుంటూ మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!!
అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ
గల్ప్ మృతులకు రూ.5 లక్షల ప్రభుత్వ సహాయం మంజూరు!
కువైట్: 1,20,000 మంది ప్రవాసులకు శుభవార్త! అకామా లేని వారికి క్షమాభిక్ష! 17 జూన్ లోపల! ఏం చేయాలి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి