ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!

2024-02-14 18:42:00

వైసీపి అధినాయకుడి గత ఎన్నికలలో వాగ్దానాలు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి వచ్చే పిట్టలదొర మాటల్లో మారాయి.

ఎన్నికలలో చేసిన ఎన్నో వాగ్దానాలు అమలకు ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు.

మాట తప్పం మడమ తిప్పం అంటూ ప్రాస డైలాగులు చెప్పే ఈయన అధికారం చేపట్టిన తర్వాత అన్ని తిప్పారు.

టీడీపీ కార్యకర్త దారుణ హత్య!!

ఎన్నికల ముందు కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూడా దండుకుని అధికారం చేపట్టిన తర్వాత అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు.

ఎన్నికల ముందు బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు హత్య చేయించారని సొంత పత్రిక సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టి మరీ రాశారు.

కట్ చేస్తే బాబాయి హత్యలో సొంత కుటుంబ సభ్యులే దోషులుగా సిబిఐ నిర్ధారించింది.

వారిని కాపాడడానికి ఈయన తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరీ పైరవీలు చేస్తున్నారు.

వివేకానంద రెడ్డి చెల్లెలు సునీత తండ్రి హత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ ఒంటరి పోరాటం చేస్తుంది.

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

పోరాటం ఆపాలంటూ వైసీపీ నుండి సునీతకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి.

అన్న జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఈయన సొంత చెల్లి వైఎస్ షర్మిల అన్న కోసం పాదయాత్రలు చేసి పార్టీని బతికించింది.

అధికారంలోకి వచ్చిన ఈయన అధికారంలో వాటా సంగతి దేవుడెరుగు తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులు కూడా వాటా ఇవ్వకుండా తన్ని తరిమేశారు.

తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి నాలుగున్నర ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి తలదాచుకున్నారు.

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అన్న ఈయన చేసిన నమ్మకద్రోహానికి కక్ష తీర్చుకోవడానికి చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

జగనన్నను నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఎలా నష్టపోయారో చెబుతూ షర్మిల రోడ్డు ఎక్కారు.

మరొకవైపు రాష్ట్ర ప్రజలను ఈయన ఎలా వంచించారు సాక్షాధారాలతో ఉతికి ఆరేస్తున్నారు.

దీనితో చెల్లెలు షర్మిలపై కూడా ఈయన బ్యాచ్ అసభ్య పదజాలంతో దాడులకు తెగబడుతున్నారు.

జగన్ సొంత పత్రిక సాక్షిలో కూడా షర్మిలను వ్యక్తిగతంగా దూషిస్తూ కథనాలు వండి వార్చుతున్నారు.

అన్నా చెల్లెలు మధ్య రగులుతున్న యుద్ధమేఘాలను చూసి తల్లి మౌనంగా రోదిస్తోంది.

తల్లికి చెల్లెళ్లకు న్యాయం చేయలేని ఈయన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు న్యాయం చేస్తారని చెబుతున్న మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!

రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టుకుని, పది పదిహేను కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ లో వెళుతూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఈయన పెత్తందారులకు పేదలకు యుద్ధం అంటున్న ఈయన  పెత్తందారా! పేదవాడా!

అధికారం రావడానికి ముందు అమరావతి రాజధాని అన్న ఈయన అధికారం వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు.

ఒక్క ఛాన్స్ ఉంటూ ప్రజలను దేహి అంటూ ఓట్లడుకున్న ఈయన ఆ ఒక్క ఛాన్స్ లో ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించారు.

ఆటో అన్నలకు గుడ్ న్యూస్!!

ఈయన అధికారం శాశ్వతం అనుకొని తల్లిని చెల్లిని గెంటేసి, ప్రజలను వంచించి, దేశ సంపదను కొల్లగొట్టుకుని కోట్లు వెనకేసుకునీ ఇప్పుడు నేను ఒంటరిని అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

డబ్బే ప్రధానం అనుకుని అయిన వారిని దూరం చేసుకుంటే ఎవరైనా ఒంటరిగాక తప్పదు.

రాష్ట్రంలో అధికారం మదంతో అధికారం రావడానికి కష్టపడిన అయినవారిని అధికారం అప్పగించిన ప్రజలను ఈయన దూరం చేసుకున్నారు.

150 యొక్క మంది ఎమ్మెల్యేలలో దళితులు బడుగు బలహీన వర్గాలకు చెందిన శాసనసభ్యులను కూడా మార్పు పేరుతో తొలగించి ఈయన అయిన వారికి దూరమయ్యారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

కులమే ప్రధానము అనుకుని 151 మందికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకొని రాష్ట్ర సంపదను కోట్ల రూపాయలు వారికి దోచి పెట్టారు.

గ్రామాలలో పార్టీ సైనికులుగా పనిచేసే యువశక్తికి మాత్రం నెలకు 5000 రూపాయలు ఇచ్చి వాలంటీర్లుగా పని చేయించుకున్నారు.

నమ్మకద్రోహానికి నయవంచనకు ఈయన మారుపేరుగా నిలిచారనడంలో సందేహం లేదు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →