ఆంధ్రప్రదేశ్లో ఉన్నత పాఠశాలల వేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడానికి శ్రీ సత్యసాయి జిల్లాలో 32 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు డీఈవో కిష్టప్ప తెలిపారు. 32 మండలాల్లోని పాఠశాలల్లో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి, ఆ వివరాలను ఆయా మండలాల ఎంఈవోలు, పాఠశాల హెచ్ఎంలకు పంపామన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు పాఠశాల పనివేళలను పాటించాలని ఆదేశించారు. మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్కూలు సమయం.
ఇంకా చదవండి: అనంతలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన! ఇదీ షెడ్యూల్ - గ్రామస్తులతో సమావేశమై అర్జీలను!
స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన పిల్లలకి చాలా సమయం దొరకడంతో వారు ఏం చేయాలో తెలియక మొబైల్ ఫోన్ల మీద ఎక్కువ సమయం గడుపుతున్నారు. చదువు మీద ధ్యాస పోవట్లేదు. పిల్లలకి ఆ వన్ అవర్ కూడా పాఠశాలలో ఉంటే పిల్లలు ఇంకా ఎక్కువ సమయం చదువుపైన గడపడం కోసం వీలుంటుంది. ఈ ఒక గంట పిల్లలు క్లాస్ రూమ్ లోనే ఉంటే ఎలా ఉంటుందో చూడడం కోసం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో ముఖ్య మండలాలలోని ఒక హై స్కూల్ని ఎంపిక చేసుకుని, ఈనెల 25వ తారీకు నుంచి 30వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టు కింద స్కూల్ సమయాన్ని కొత్త టైం టేబుల్తో స్కూల్ నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్త టైం టేబుల్ అమలులో భాగంగా ఉదయం సాయంత్రం ఐదు గంటల వరకు ఉండే పాఠశాలలో పనిగంటలలో ఉదయం మధ్యాహ్నం ఇచ్చే విరామ సమయాల్లో ఐదు నిమిషాల అదనంగా పెంచారు.
ఇంకా చదవండి: మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లుగా వ్యవహరిస్తున్నా జగన్! ఏ వ్యక్తి కూడా చేయని విధంగా!
భోజనం సమయాన్ని కూడా 15 నిమిషాలు పెంచుతూ ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఉదయం మొదటి పీరియడ్ను ఐదు నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు, 40 నిమిషాలు ఉన్న ఏడు పీరియడ్లను 45 నిమిషాలకు పెంచింది ప్రభుత్వం. చాలామంది పిల్లల తల్లిదండ్రులు స్కూల్లోనే ఐదు గంటల వరకు పిల్లలు ఉండడం ఇష్ట పడుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఐదు గంటల వరకు స్కూల్లో సమయం పెంచడం ద్వారా ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం కూడా ఉందని పలువురు అభిప్రాయాలు తెలుపుతున్నారు. పిల్లలు ఇంటికొచ్చిన తర్వాత హోంవర్క్ చేయకుండా ఆటలాడుకుంటూ అయితే అదే సమయంలో క్లాస్ టీచర్ల దగ్గర ఉండడంతో ఆ సమయంలో చదువుపై ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఇంకా చదవండి: కీలక అప్డేట్.. ఏ పథకానికైనా అర్హత ఆ కార్డే.. ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం! ఆ వివరాలు మీ కోసం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: