Ration Card Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్! మంత్రి కీలక ప్రకటన! ఇలా చేస్తే రేషన్ కార్డు రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి రైతులకు శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం, ప్రభుత్వం రూ.160 కోట్ల సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఈ డబ్బు సెప్టెంబర్ 20 నుండి 25 మధ్యలో జమ అవుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. ఈ సబ్సిడీ ద్వారా మొత్తం 37 వేల మంది మామిడి రైతులు లాభం పొందనున్నారు.

Mission Vatsalya: సర్కార్ మరో శుభవార్త! వారికి ఒకొక్కరికి నెలకు రూ.4 వేలు! వెంటనే అప్లై చేసుకోండి!

ఈ సీజన్‌లో తోతాపురి మామిడి ఉత్పత్తి బాగుండటంతో ప్రభుత్వం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది. మొత్తం 4.10 మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించగా, అందులో గుజ్జు పరిశ్రమల తరపున 2.35 టన్నులు, ర్యాంపుల తరపున 1.65 టన్నులు కొనుగోలు చేశారు. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయని ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

District Reorganization: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై కసరత్తు! కొత్తగా ఈ మూడు ఏర్పాటు!

ఉద్యానశాఖ కూడా మామిడి పంట అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. గత ఏడాది రూ.20 కోట్లు ఖర్చు చేయగా, అందులో రూ.10 కోట్లు మామిడి పంట కోసం ఉపయోగించారు. కొత్త మొక్కలు, సాగు సామగ్రి, రైతులకు శిక్షణ వంటి కార్యక్రమాలపై ఈ నిధులను ఖర్చు చేశారు. అలాగే మిగిలిన నిధులను కవర్లు, మౌలిక సదుపాయాల కోసం వినియోగించారు.

Delhi Tour: రేపు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీ బిజీ.. కీలక నేతలతో భేటీలు, ఏపీకి రానున్న నిధులు!

ఇంకా మామిడి సాగు విస్తరణకు ప్రభుత్వం రూ.100 కోట్ల విలువైన మైక్రో ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేసింది. దీని ద్వారా దాదాపు 10,500 హెక్టార్ల భూభాగంలో సౌకర్యం కల్పించబడింది. చిత్తూరులో మామిడి దిగుబడి అధికంగా రావడంతో అక్కడ గుజ్జు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒక కంపెనీ ముందుకు వచ్చినట్లు కూడా అధికారులు తెలిపారు.

India USA Relation: భారత్‌తో బంధం మాకు అత్యంత కీలకం.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు.!

అయితే కొంతమంది రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా “మ్యాంగో వెల్ఫేర్ అసోసియేషన్” పేరిట అవాస్తవ ప్రచారం జరుగుతోందని, దానికి ఎటువంటి గుర్తింపు లేదని అధికారులు స్పష్టం చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. సబ్సిడీ విషయంలో ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందని, తప్పుదారి పట్టించే వారికి కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

AP Govt: మరోసారి ఐఏఎస్‌ల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. అభివృద్ధికి కొత్త ఊపు!
Ration Card Update: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. మార్పులు, చేర్పులకు మరో ఛాన్స్ - చివరి తేదీపై ప్రకటన, తాజా అప్డేట్ ఇదే.!
Project Amaravati : వారి రాకతో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అమరావతి!
OTT Movie: నిజమైన కథ.. భర్తను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు పడేసే భార్య.. ఈ క్రైమ్ థ్రిల్లర్ వేరే లెవెల్!
NIA Court: ఉగ్రకుట్రల జాడలో పాక్‌ దౌత్యవేత్త..! చెన్నై ఎన్ఐఏ కోర్టు విచారణకు ఆదేశాలు!