ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. వాటిని అమలు చేయడానికి తగిన ప్రణాళికలను రూపొందించే పనిలో ఉంది. అయితే అంతకంటే ముందు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలు, లబ్ది పొందుతున్న వారికి కొత్త కండీషన్ పెట్టింది. ఇకపై రాష్ట్రంలో స్టూడెంట్స్కి ఫీజ్ రీయింబర్స్మెంట్, గృహిణులకు దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు రేషన్ కార్డు కలిగి ఉండాలని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
అర్హులైన వాళ్లలో రేషన్ కార్డులు లేని వారికి సంక్రాంతిలోగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్లో పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానికి సంబంధించి ఎవరు అర్హులు అనే విషయాన్ని గుర్తించడం ముఖ్యం. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో ఫించన్ తీసుకునే వాళ్ల దగ్గర నుంచి ఫీజ్ రీయింబర్స్మెంట్ విద్యార్ధులు, దీపం-2 పథకం లబ్దిదారులు తప్పని సరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలని నిర్ణయించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవి కావాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్రాంతి లోపు రేషన్ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినట్లుగా టీడీపీ వెబ్ సైట్లో పెట్టడం జరిగింది.
ఇంకా చదవండి: ఈసారి అమరావతిలోనే రిపబ్లిక్ డే - ఎక్కడో తెలుసా..? తొలిసారి రాష్ట్రస్దాయి వేడుక ఇదే!
ఇప్పటికే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది. అర్హులైన వారు డిసెంబర్ 2 నుంచి 28వ తేది వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా కొత్త కార్డులు మంజూరు చేయనుంది. ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వెనుక అర్ధం ఏమిటంటే గతంలో సీఎంలుగా పని చేసిన వారి ఫోటోలను తొలగించి ..ఏపీ ప్రభుత్వ గుర్తింపు ఫోటోతో కార్డుల్లో కొత్తగా చేరిన సభ్యులు, లేదంటే లేని వ్యక్తుల పేర్లను తొలగించి అప్డేట్ చేయనుంది.
ఇంకా చదవండి: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్! పెన్షన్ లపై కీలక ఆదేశాలు! పూర్తి వివరాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: