మహిళలకు ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా.. మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద రుణం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసిన ఘటన ఒకటి తాజాగా హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. 33 ఏళ్ల మహిళ ఏకంగా రూ.1,32,000 మోసపోయింది. అందుకే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏమరపాటుగా ఉంటే మాత్రం డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసగాడి నుంచి మహిళకు కాల్ వచ్చింది. ఆ తర్వాత ఈ మోసం జరిగింది. నిందితుడు హైదరాబాద్లోని పీఎంఈజీపీకి సంబంధించిన ఓ బ్యాంకు జనరల్ మేనేజర్గా పరిచయం చేసుకున్నాడు.
ఇంకా చదవండి: నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..
సైబర్ మోసగాడు పీఎంఈజీపీ కింద రూ.5 లక్షలకు రుణం ఇస్తామని, 30 శాతం సబ్సిడీతో మంజూరైందని మహిళకు మాయమాటలు చెప్పాడు. రుణం కోసం నెలవారీ EMI రూ. 5,480 అవుతుందని బాధితురాలికి తెలియజేశాడు. లోన్ ఆఫర్ నచ్చితే సమ్మతి తెలియజేయాలని నమ్మించి డబ్బులు దోచేశాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు వివిధ చార్జీల నిమిత్తం రూ.1.32 లక్షలు మోసగాడికి ట్రాన్స్ఫర్ చేసింది. డిమాండ్ డ్రాఫ్ట్ ఛార్జీల కోసం కొంత మొత్తాన్ని చెల్లించాలని సైబర్ మోసగాడు ఆమె నుంచి డబ్బులు కొట్టేశాడు. తర్వాత పీఎంఈజీపీ చెక్కు ఇంటికి వస్తుందని ఆమెను నమ్మబలికాడు. చాలా రోజులు వేచి చూసినా చెక్కు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి మహిళ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!
అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?
26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
సుప్రీంకోర్టులో విజయపాల్కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!
ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!
అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: