Praja Vedika Program Today: తేదీ 26-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 26 ఫిబ్రవరి 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ టి.జి. భరత్ గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ జి. నరసింహ యాదవ్ గారు(ఆంధ్రప్రదేశ్ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
3. శ్రీ చౌదరి అవినాష్ గారు (DCMS చైర్మన్)
నంద్యాల, ఏలూరు నేతలతో ఆత్మీయ విందు.. ముచ్చటగా సాగిన ప్రజాప్రతినిధుల భేటీ!
నంద్యాల మరియు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో బుధవారం నిర్వహించిన విందు సమావేశం అత్యంత సాన్నిహిత్యంగా, ఆహ్లాదకరంగా సాగింది. రాజకీయాలకు అతీతంగా కేవలం ఆప్యాయతలను పంచుకునే వేదికగా ఈ సమయం గడిచిపోయింది. నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన నేతలందరూ వారి కుటుంబాలతో కలిసి సరదాగా ముచ్చటించడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. సమయం తెలియకుండా సాగిన ఈ ఆత్మీయ భేటీ మా మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసింది.
ఈ విందులో పాల్గొన్న సోదరీమణులకు ప్రత్యేక జ్ఞాపకంగా మా నియోజకవర్గ గర్వకారణమైన మంగళగిరి పట్టుచీరలను బహుకరించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మంగళగిరి చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో ఎంతో అద్భుతంగా నేసిన ఈ పట్టుచీరలు మన సంస్కృతికి మరియు కళాకారుల కష్టానికి గుర్తింపు. అతిథులు తమ ప్రేమను కానుకగా ఇస్తే, నేను వారికి మన ప్రాంతపు చేనేత కళా వైభవాన్ని కానుకగా అందించాను. ఈ కలయిక కేవలం ఒక విందుగానే కాకుండా, ప్రేమానురాగాల మేళవింపుగా చిరకాలం గుర్తుండిపోతుంది.