AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.... 2 శాతం పెరిగిన డిఏ (DA)! Potato UlliKaram: నోరూరించే ఆంధ్ర స్టైల్ బంగాళదుంప ఉల్లికారం.. ఇలా చేస్తే రుచి అమోఘం! US Culture: అమెరికాలో బట్టలు బయట ఆరబెడితే జరిమానా! 80 శాతం ప్రపంచం ఒకలా.. ఇక్కడ మరోలా!! Underground City: 280 అడుగుల లోతులో అద్భుతమైన భూగర్భ నగరం! 18 అంతస్తులు.. 20 వేల మందికి ఆశ్రయం... ఎక్కడో తెలుసా! 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Sea-Plane: విశాఖ టు పాడేరు కేవలం 20 నిమిషాలే.. సీప్లేన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!! PM Modi: ఈ రోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం!! Delimitation: డీలిమిటేషన్ వెనుక బీజేపీ పెద్ద కుట్ర! ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు..! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.... 2 శాతం పెరిగిన డిఏ (DA)! Potato UlliKaram: నోరూరించే ఆంధ్ర స్టైల్ బంగాళదుంప ఉల్లికారం.. ఇలా చేస్తే రుచి అమోఘం! US Culture: అమెరికాలో బట్టలు బయట ఆరబెడితే జరిమానా! 80 శాతం ప్రపంచం ఒకలా.. ఇక్కడ మరోలా!! Underground City: 280 అడుగుల లోతులో అద్భుతమైన భూగర్భ నగరం! 18 అంతస్తులు.. 20 వేల మందికి ఆశ్రయం... ఎక్కడో తెలుసా! 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Sea-Plane: విశాఖ టు పాడేరు కేవలం 20 నిమిషాలే.. సీప్లేన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!! PM Modi: ఈ రోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం!! Delimitation: డీలిమిటేషన్ వెనుక బీజేపీ పెద్ద కుట్ర! ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు..! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు!

Qatar: ఎన్నారై టీడీపీ ఖతార్‌ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం! చంద్రబాబు జన్మదినం సందర్భంగా..

Qatar: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఖతార్‌లో తెలుగు ప్రవాసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి మహా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.

Published : 2026-04-18 20:35:00

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకున్న ఖతార్‌లో తెలుగు ప్రజలు..

ఎంతో ఘనంగా మహా రక్తదాన శిబిరం ఏర్పాటు..

ఖతార్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఖతార్‌లో తెలుగు ప్రవాసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి మహా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా “ఒక్క రక్త బిందువు – ఎన్నో ప్రాణాలకు జీవం” అనే మహత్తర సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

ఎన్నారై టీడీపీ ఖతార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో కులం, మతం, దేశం, ధనిక–పేద అనే భేదాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యమని నిరూపించారు. ఒక మనిషి మరో మనిషికి ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమానం రక్తదానం అనే భావనను ప్రతి ఒక్కరిలో నింపేలా కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా ఎన్.ఆర్.ఐ టీడీపీ ఖతార్ అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ… నాయకుడి జన్మదినాన్ని వేడుకగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహించడం నిజమైన గౌరవమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజాసేవ కోసం అని, సేవ చేయడానికి దేశాల మధ్య ఎలాంటి భేదం ఉండదని, ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలకు అండగా నిలబడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

శనివారం వర్కింగ్ డే అయినప్పటికీ ఖతార్‌లోని తెలుగు కుటుంబాల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 65 మంది సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా టీడీపీ ఖతార్ మహిళలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి సేవా భావం సమాజానికి స్ఫూర్తినిచ్చే ఉదాహరణగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు రవి వేమూరి, గల్ఫ్ విభాగం అధ్యక్షులు రావి రాధాకృష్ణ, ఏపీ ఎన్నార్టీ సర్వీసెస్ డైరెక్టర్ అక్కిలి నాగేంద్రబాబు, ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తదితరులు తమ సహకారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా తెలుగు డయాస్పోరా సభ్యులు మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సేవా భావం, సమాజం పట్ల బాధ్యతను నిలబెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.

Spotlight

Read More →