Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Laundry Hacks: బట్టలపై టీ, కాఫీ మరకలా? చింత వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! Amaravati Updates: అమరావతికి సరికొత్త మణిహారం.. ఆ వాగుపై భారీ స్టీల్ బ్రిడ్జ్.. తొలి గడ్డర్ ఫిక్సింగ్ సక్సెస్! Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Laundry Hacks: బట్టలపై టీ, కాఫీ మరకలా? చింత వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! Amaravati Updates: అమరావతికి సరికొత్త మణిహారం.. ఆ వాగుపై భారీ స్టీల్ బ్రిడ్జ్.. తొలి గడ్డర్ ఫిక్సింగ్ సక్సెస్!

Chandrababu: పోలవరం, అమరావతిని పునర్నిర్మించే అదృష్టం నాదే.. రూ. 1,000 కోట్లు వదులుకున్నాం.. సీఎం కీలక వ్యాఖ్యలు.!

Chandrababu: సూరేపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, రాష్ట్ర భవిష్యత్తు మరియు అభివృద్ధి ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ఘనంగా ప్రకటించారు.

Published : 2026-04-09 17:10:00
  • Politics: "మారీచుడి కంటే ఎక్కువ వేషాలు వేస్తున్నారు": ప్రతిపక్ష పార్టీ తీరుపై చంద్రబాబు సెటైర్లు..
     
  • "గత పాలకులు పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు": డయాఫ్రామ్ వాల్ పునర్నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు..

Andhrapradesh Chandrababu: సూరేపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, రాష్ట్ర భవిష్యత్తు మరియు అభివృద్ధి ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ఘనంగా ప్రకటించారు. పోలవరం పూర్తయితే కృష్ణా డెల్టాకు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తి చేస్తే, గత పాలకులు తమ నిర్లక్ష్యంతో ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని విమర్శించారు. ముఖ్యంగా రూ. 440 కోట్లతో నిర్మించిన డయాఫ్రామ్ వాల్‌ను నాటి ప్రభుత్వం ముంచేసిందని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. 1000 కోట్లతో దానిని పునర్నిర్మించి పూర్తి చేశామని వెల్లడించారు. కొందరు నిర్మాణాలను కూల్చడానికి ప్రయత్నిస్తుంటే, ఆ అమరావతి రాజధానిని మరియు పోలవరం ప్రాజెక్టును మళ్లీ పునర్నిర్మించే అదృష్టం తనకు దక్కిందని ఆయన పేర్కొన్నారు.

విద్యుత్ రంగంలో సంస్కరణలపై స్పందిస్తూ, రూ. 4,660 కోట్ల విద్యుత్ భారాన్ని సామాన్య ప్రజలపై వేయకుండా చార్జీలను 'ట్రూ డౌన్' చేశామని, భవిష్యత్తులోనూ కరెంటు ధరలను పెంచే ప్రసక్తే లేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. గత ఐదేళ్లలో పాలకులు 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి రూ. 32 వేల కోట్ల భారం ప్రజలపై వేశారని గుర్తు చేశారు. సోలార్ రూఫ్ టాప్ విధానం ద్వారా సామాన్యులను కూడా విద్యుత్ ఉత్పత్తిదారులుగా (ప్రోజ్యూమర్) మార్చే సరికొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, రాష్ట్రంలో గంజాయి జాడ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో రాజీ పడేది లేదని, ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ప్రజా సేవలను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి, హాస్టళ్లు, బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోలు మరియు మధ్యాహ్న భోజనం వంటి అంశాల్లో నాణ్యత పెరగాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదని, పౌర సేవలు అత్యున్నత స్థాయిలో ఉండాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, రూ. వెయ్యి కోట్ల ఆదాయాన్ని వదులుకుని మరీ ప్రజలకు ఉచిత ఇసుకను అందిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాను నిరంతరం ఆలోచిస్తానని చెబుతూ, రాష్ట్రంలోని ఒక పార్టీ మారీచుడి కంటే ఎక్కువ వేషాలు వేస్తోందని పరోక్షంగా ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఏపీ అభివృద్ధిలో మైలురాళ్లుగా నిలుస్తాయని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →