ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నారీ నారీ నడుమ మురారి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? నవ్వుల విందుకు సిద్ధమవ్వండి! Interesting Facts: మూసి ఉన్న గదిలో దుమ్ము ఎలా చేరుతుంది? మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! 2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! GurukulAdmissions: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం! ఉచిత కార్పొరేట్ విద్యకు ఛాన్స్…! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నారీ నారీ నడుమ మురారి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? నవ్వుల విందుకు సిద్ధమవ్వండి! Interesting Facts: మూసి ఉన్న గదిలో దుమ్ము ఎలా చేరుతుంది? మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! 2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! GurukulAdmissions: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం! ఉచిత కార్పొరేట్ విద్యకు ఛాన్స్…! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు!

అసలు సరఫరా అయింది నెయ్యే కాదు – రసాయన మిశ్రమమని సిట్ నిర్ధారణ – ఎన్‍డీడీబీ నివేదికపై వైసీపీ గందరగోళం – భక్తుల మనోభావాలతో చెలగాటం – తిరుమల పవిత్రతపై జరుగుతున్న రాజకీయ యుద్ధం.

Published : 2026-01-31 12:27:00
  • ఇది నెయ్యి కాదు.. రసాయనాల రంగుల విందు!
  • ఎన్‍డీడీబీ వర్సెస్ ఐసీఏఆర్: ఏది నిజం?
  • రాజకీయ బుకాయింపులు - భక్తుల ఆవేదన..

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చిచ్చు రేపింది. వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని, అది పూర్తిగా రసాయనాల మిశ్రమమని సిట్ (SIT) తన ఛార్జ్ షీట్‌లో స్పష్టం చేయడంతో భక్తులు విస్మయానికి గురవుతున్నారు. అయితే, ఈ విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న వాదనలు విడ్డూరంగా ఉన్నాయి. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవలేదని తమకు తామే 'సెల్ఫ్ సర్టిఫికేట్' ఇచ్చుకుంటూ, ఉల్టా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి, అత్యున్నత సంస్థ అయిన ఎన్‍డీడీబీ (NDDB) ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పట్లో ప్రభుత్వం లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని ప్రకటించింది. ఇదే విషయాన్ని సిట్ కూడా తన దర్యాప్తులో నిర్ధారించింది. కానీ, మధ్యలో ఐసీఏఆర్ (ICAR) నివేదికను అడ్డం పెట్టుకుని వైసీపీ కొత్త డ్రామాకు తెరలేపింది. కొవ్వును గుర్తించే సాంకేతికత తమ దగ్గర లేదని, తాము అనుసరించిన పద్ధతిని వేరే సంస్థలు ధ్రువీకరించాల్సి ఉందని ఐసీఏఆర్ స్పష్టంగా చెప్పినప్పటికీ.. దానిని వక్రీకరిస్తూ "కొవ్వు లేదని తేలిపోయింది" అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.

అసలు తిరుమలకు సరఫరా అయింది నెయ్యే కానప్పుడు, అందులో రసాయనాలు, పామాయిల్ వాడటం నిజమని తేలాక.. ఇక జంతువుల కొవ్వు ఉందా లేదా అనే చర్చతో ప్రజలను పక్కదారి పట్టించడం వైసీపీ ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేవదేవుడైన వేంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ఇంతటి మహాపాతకానికి ఒడిగట్టి కూడా, తప్పును ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడం హిందూ సమాజాన్ని మరోసారి మోసం చేయడమేనని భక్తులు మండిపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు చేస్తున్న డిమాండ్లు కేవలం రాజకీయం కోసమే తప్ప, అందులో నిజాయితీ లేదని స్పష్టమవుతోంది.

తిరుమల వెంకన్న ప్రసాదం అంటే కోట్లాది మందికి ప్రాణం. అలాంటి పవిత్రమైన చోట జరిగిన ఈ అపరాధంపై రాజకీయాలు చేయడం దురదృష్టకరం. సిట్ తన దర్యాప్తును ముగించి నిందితులను కోర్టు ముందు నిలబెట్టాలని, స్వామివారి పవిత్రతను కాపాడాలని అందరూ కోరుకుంటున్నారు.

Spotlight

Read More →