
మంత్రి నారా లోకేష్ సిడ్నీలో న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్తో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు NSW మధ్య విస్తృతమైన పరిశ్రమ, ఇన్నోవేషన్, సాంకేతిక భాగస్వామ్యాన్ని ఏర్పరచే అంశాలను చర్చించారు. ముఖ్యంగా అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్లు, గ్రీన్ టెక్నాలజీలు వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
NSW ప్రీమియర్ క్రిస్ మిన్స్ ఈ భాగస్వామ్యానికి పాజిటివ్ స్పందన ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యువ ప్రతిభ, ఇన్నోవేషన్ ఫోకస్, మరియు NSW పరిశ్రమల అనుభవం కలసి, గ్లోబల్ ప్రమాణాల ఉత్పత్తులు, సాంకేతిక పరిష్కారాలను రూపకల్పన చేయగలిగే అవకాశాన్ని ఈ భాగస్వామ్యం అందిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త స్టార్టప్ ఎకోసిస్టమ్, గ్రీన్ టెక్నాలజీ, అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో నాణ్యత ఆధారిత వృద్ధిని సాధించే దిశగా ఈ భాగస్వామ్యం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.ఇది ఆంధ్రప్రదేశ్–NSW ఇన్నోవేషన్ & ఇండస్ట్రీ భాగస్వామ్యానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్–NSW ఇన్నోవేషన్ & ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పరచే అవకాశం ఉందని ఈ భాగస్వామ్యం ద్వారా విద్యారంగంలో కొత్త కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్లు, ఇన్నోవేషన్ సెంటర్ల నిర్మాణం సాంకేతిక రంగంలో నూతన ప్రాజెక్ట్లు సృష్టించడానికి ఒక దిశా నిర్దేశం ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.