తనపై అనవసర ఆరోపణలు చేశారని శ్యాండిల్ వుడ్ నిర్మాత ఎన్. ఎం. సురేష్ తదితరులపై బహుబాష నటుడు, దర్శకుడు కిచ్చా సుదీప్ వేసిన పరువు నష్టం దావాను కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ప్రముఖ నిర్మాత ఎన్ఎం. సురేష్, కుమార్లు ఇప్పుడు కోర్టు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అంతే కాకుండా విచారణలో పరువు నష్టం జరిగినట్లు నిర్ధారణ అయితే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. తనపై ట్రయల్ కోర్టులో కొనసాగుతున్న కేసును రద్దు చేయాలని మనవి చేస్తూ శ్యాండిల్ వుడ్ నిర్మాత సురేష్ కర్ణాటక హైకోర్టులో దరఖాస్తు సమర్పించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం నిర్మాత సురేష్ సమర్పించిన పిటిషన్ ను పరిశీలించారు.
ఇంకా చదవండి: రాజకీయ నేత కుమారుడితో సమంత మరో ప్రేమాయణం..అతను ఎవరో మీకు తెలుసా? సోషల్ మీడియాలో సంచలనంగా మారింది!!
వాదనలు విన్న న్యాయస్థానం ఫిర్యాదులోని వాస్తవాలు, ఆయన ఇచ్చిన సెల్ఫ్ స్టేట్మెంట్ను పరిశీలిస్తే పిటిషనర్ వాంగ్మూలం కించపరిచేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సమాజంలో ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, ఫిర్యాదుదారుడి అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోందని, కాబట్టి ట్రయల్ కోర్టు సమన్లుజారీ చేయడంలో ఎలాంటి లోపం లేదని కోర్టు తెలిపింది. కర్ణాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ మరియు ఫిల్మ్ కామర్స్ బోర్డ్ సెక్రటరీ అయిన తన క్లయింట్ ఎంఎన్ కుమార్ కు, ఫిర్యాదుదారుకు మధ్య వ్యాజ్యం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కాబట్టి తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు.
ఇంకా చదవండి: ఏపీ ఎన్నికల వేళ రూ.200 కోట్లు కేటాయించిన నెంబర్ వన్ హీరో! సొంత ఊరి కోసం ఆలోచన!!
అయితే కోర్టు అందుకు అంగీకరించలేదు. గతేడాది విలేకరుల సమావేశంలో నిర్మాత ఎం. ఎన్. కుమార్, ఎన్. ఎం. సురేష్ తదితరులు నటుడు సుదీప్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సందేశాలు కూడా పోస్టు చేశారు. హీరో సుదీప్ ను కించపరుస్తు ఆ నిర్మాతలు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలపై హీరో సుదీప్ క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు 13వ ఏసీఎంఎం కోర్టు ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయని తేల్చింది. నిర్మాతలు ఎం. సురేష్తో పాటు ఇతర నిర్మాతలను కోర్టుకు పిలిపించారు. అనంతరం ఇద్దరు నిందితులు ట్రయల్ కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. కానీ సమన్లను రద్దు చేయాలని నిర్మాత ఎన్. ఎం. సురేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో నిర్మాతలు ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: