Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు! Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్! job notifications: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు! యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు.. India Work Culture: వర్క్ కల్చర్‌పై నెట్టింట రచ్చ: భారత్ వర్సెస్ అమెరికా.. బెంగళూరు ఉద్యోగిని పోస్ట్ వైరల్! Work From Home: ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఈసారి కొత్త రూల్స్‌తో...! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... గౌరవ వేతనం 25 శాతం పెంపు! Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు! Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్! job notifications: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు! యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు.. India Work Culture: వర్క్ కల్చర్‌పై నెట్టింట రచ్చ: భారత్ వర్సెస్ అమెరికా.. బెంగళూరు ఉద్యోగిని పోస్ట్ వైరల్! Work From Home: ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఈసారి కొత్త రూల్స్‌తో...! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... గౌరవ వేతనం 25 శాతం పెంపు!

Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు!

Modi: దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఉపాధి అవకాశాన్ని అందించనుంది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు 51 వేలకుపైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు.

Published : 2026-05-22 18:06:00

నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్.. రేపు భారీ నియామకాలు..

ప్రధాని మోదీ చేతుల మీదుగా యువతకు ఉద్యోగ పత్రాల పంపిణీ..

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఉపాధి అవకాశాన్ని అందించనుంది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు 51 వేలకుపైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ 19వ రోజ్‌గార్ మేళా నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగాల్లో చేరనున్నారు. ముఖ్యంగా రైల్వే శాఖ, హోంశాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యాశాఖ వంటి కీలక విభాగాల్లో నియామకాలు చేపట్టారు.

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని మోదీ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో రోజ్‌గార్ మేళా కీలక పాత్ర పోషిస్తోంది. యువతకు పారదర్శకంగా, వేగంగా ప్రభుత్వ ఉద్యోగాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.

రోజ్‌గార్ మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన 18 మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు పంపిణీ చేశారు. దీంతో వేలాది కుటుంబాలకు ఉపాధి భరోసా లభించగా, యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యువతకు ఈ నియామకాలు కొత్త జీవితానికి నాంది పలుకుతున్నాయని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →