వీలైనంత ఎక్కువ మంది భారతీయులు అమెరికా(USA)లో చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసా (US Visa)లు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే పేర్కొన్నారు. ఏపీలో విశాఖపట్నం (Visakhapatnam) లేదా విజయవాడ (Vijayawada) లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అంతర్జాతీయ విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆమె ప్రజాసంబంధాల అధికారి అలెగ్జాండర్ మెక్ లారెన్తో కలసి మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ తొలిస్థానంలో నిలిచింది. 2023-24 నాటికి 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులుండగా అందులో 56 శాతం ఏపీ, తెలంగాణకు చెందినవారే. తెలంగాణ నుంచి 34 శాతం, ఏపీ నుంచి 22 శాతం విద్యార్థులున్నారు. ఈ వేసవి సీజన్లో హైదరాబాద్లో 47 వేలకు పైగా విద్యార్థి వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాం. దేశంలోని దిల్లీ రాయబార కార్యాలయం, ముంబయి, చెన్నై, కోల్కతాలతో పోలిస్తే హైదరాబాద్ కాన్సుల్ జనరల్లో నాన్ఇమిగ్రెంట్ వీసాలు ఎక్కువగా జారీ చేస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 1,600 వీసాలు మంజూరు చేస్తుండగా.. ఆ సంఖ్యను 2025 ఫిబ్రవరి నాటికి 2,500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది వాషింగ్టన్లో మూడు నెలల పాటు 'హెచ్1బీ డొమెస్టిక్ రీవాలిడేషన్ ప్రోగ్రాం'ను పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి అమెరికాలో నివసిస్తున్న 10 వేల మంది భారతీయుల హెచ్ 1బీ వీసాలను స్వదేశానికి రాకుండానే పునరుద్ధరించాం. భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశముంది.
ఇంకా చదవండి: ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
నిరీక్షణ సమయాన్ని 3 నెలలకు తగ్గించాం
విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా వీసా ప్రక్రియను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నాం. విద్యార్థి, ఉపాధి, ఇతర వీసాల కోసం అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని మూడు నెలలకు తగ్గించగలిగాం. 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు మంజూరు చేశాం. ప్రపంచంలో ఏ దేశంలోనూ అన్ని వీసాలు జారీ చేయలేదు. ప్రస్తుతం అధికశాతం విద్యార్థులు మాస్టర్స్ చదివేందుకే యూఎస్ వెళ్తున్నారు. భవిష్యత్తులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది' అని రెబెకా డ్రామే వెల్లడించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: