Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం!

Tirupati Latest News: తిరుమలలో రూ.120 కోట్లతో అత్యాధునిక భారీ వంటశాల..ఇకపై మరింత వేగంగా, రుచికరంగా అన్నప్రసాదం.!!

Tirupati Latest News: తిరుమల శ్రీవారి భక్తుల కోసం రూ.120 కోట్ల వ్యయంతో అత్యాధునిక వంటశాలను టీటీడీ నిర్మించనుంది. రిలయన్స్ సంస్థ విరాళంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా గంటకు 3 టన్నుల అన్నం తయారు చేసే సాంకేతికత అందుబాటులోకి రానుంది.

Published : 2026-03-15 08:36:00

Tirupati Latest News: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం  కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై  అన్నదానం మరింత వేగవంతం చేస్తూ, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ వంటశాలను నిర్మించనుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ సహకారంతో సుమారు రూ.120 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

గత నాలుగు దశాబ్దాలుగా తిరుమలలో నిరంతరాయంగా ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అయితే, ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, వంట చేసే విధానం నుంచి భక్తులకు వడ్డించే వరకు అన్ని దశల్లోనూ ఆటోమేషన్ (యంత్రాల వినియోగం) తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.

ఈ కొత్త కిచెన్‌లో గంటకు 3 టన్నుల అన్నం, సాంబారు తయారు చేయగల సామర్థ్యం ఉన్న భారీ బాయిలర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న యంత్రాలు 15 ఏళ్ల నాటివి కావడంతో తరచూ రిపేర్లు వస్తున్నాయి. కొత్తగా నిర్మించే అదనపు భవనాల్లో కేవలం వంటశాల మాత్రమే కాకుండా, భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని తినేలా డైనింగ్ హాళ్లను కూడా నిర్మించనున్నారు. దీనివల్ల భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.

గతేడాది తిరుమల పర్యటనకు వచ్చిన రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి టీటీడీ అధికారులు తమ మాస్టర్ ప్లాన్‌ను వివరించారు. ఈ గొప్ప కార్యానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా రిలయన్స్ సంస్థ రూ.120 కోట్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రాగా, ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు పాలకమండలి అధికారికంగా ఆమోదం తెలిపింది.

సాంకేతికతను జోడించడం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్ని వంటకాలను కొత్త పద్ధతిలో తయారు చేయనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న ఈ వంటశాల, దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక అన్నదాన కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది.

Spotlight

Read More →