టెక్ వరల్డ్ బిలియనీర్, మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల బాస్ మార్క్ జుకర్బర్గ్ సరికొత్తగా కనిపించారు. ఇతని గురించి ఓ విచిత్రమైన అభిరుచి వెలుగులోకి వచ్చింది. మార్క్ జుకర్బర్గ్ ఆవులను పెంచుతూ కనిపించారు. అవును ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితాలో ఒకరైన జుకర్బర్గ్ కొత్త అభిరుచి, ఆవుల పెంపకం అని తెలిసింది.
అంతేకాదు అతను ఆవులకు డ్రై ఫ్రూట్స్, పండ్లతోపాటు బీరును కూడా అందిస్తున్నారు. అయితే అత్యుత్తమ ఆవు మాంసాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగానే ఇది చేస్తున్నట్లు వెల్లడించారు.అందులో భాగంగా చెట్లను పెంచడం సహా పలు రకాల పనుల్లో తన కుమార్తెలు కూడా పనిచేస్తారని అంతేకాదు హవాయిలోని ఓ ప్రదేశంలో జుకర్బర్గ్ ఇప్పటికే సగం ద్వీపంలో వీటిని కలిగి ఉన్నాడు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
జుకర్బర్గ్ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఆవులు, ఆవు మాంసం పట్ల తనకున్న అభిరుచిని ప్రకటించారు. అతను కాయైలోని కొయోలౌ రాంచ్లో ఆ పశువులను పెంచుతున్నానని పేర్కొన్నారు. మార్క్ జుకర్బర్గ్ ఆ పోస్టులో మాంసం ముక్కను ఉంచి ఇది చాలా ఖరీదైనదని ప్రస్తావించారు.
అయితే ప్రస్తుతం ఆవు మాంసం కోసం వాటిని పెంచడం వివాదాస్పదమైన అంశం కావచ్చు. కానీ మాంసం ఉత్పత్తి పర్యావరణాన్ని ఎంత ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందో పరిశీలిస్తే మాత్రం తాను బాధ్యతాయుతమైన రైతు(farmer)గా ఉంటానని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా ప్రతి ఆవు సంవత్సరానికి 5,000-10,000 పౌండ్ల ఆహారాన్ని తింటుందని చెప్పారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి