దిల్లీ: జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్, సరికొత్తగా జీఎల్ఎస్ లగ్జరీ ఎస్యూవీని పెట్రోల్ (రూ.1.32 కోట్లు), డీజిల్ (రూ.1.37 కోట్లు) వెర్షన్లలో ఆవిష్కరించింది. ఈ ఏడాది భారత్లో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు, 12కు పైగా కొత్త కార్లను విపణిలో ప్రవేశపెట్టబోతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ వెల్లడించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇందులో 3 విద్యుత్ వాహనాలుంటాయని తెలిపారు. తాము విక్రయిస్తున్న వాహనాల్లో సగానికి పైగా, రూ.1.5 కోట్ల కంటే విలువైన టాప్-ఎండ్ మోడళ్లే ఉంటున్నాయని తెలిపారు. 2022 తో పోలిస్తే 2023లో కంపెనీ 10 శాతం వృద్ధి సాధించి, 17,408 వాహనాలతో రికార్డు విక్రయాలను నమోదు చేసిందన్నారు. 2024 విక్రయాల్లో రెండంకెల వృద్ధి సాధిస్తామని సంతోష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ వద్ద 3,000 వాహనాలకు ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి