Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్! Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! South Central Railway: ఏపీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ స్పెషల్ రైళ్లన్నీ రెగ్యులర్! Traffic Alert: ప్రయాణికులకు అలెర్ట్... రేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు! ట్రయల్ రన్... Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్! Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! South Central Railway: ఏపీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ స్పెషల్ రైళ్లన్నీ రెగ్యులర్! Traffic Alert: ప్రయాణికులకు అలెర్ట్... రేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు! ట్రయల్ రన్...

AP High Speed Rail: ఏపీకి కేంద్రం మెగా ఆఫర్..రాష్ట్రాన్ని చుట్టేయనున్న మూడు హైస్పీడ్ కారిడార్లు.!!

AP High Speed Rail: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌ను తిరుపతి, నాయుడుపేట మీదుగా మళ్లించేందుకు కేంద్రం అంగీకరించింది. దీనివల్ల అమరావతికి రెండు హైస్పీడ్ కారిడార్ల లింక్ ఏర్పడనుంది

Published : 2026-04-06 14:32:00

South India High Speed Rail Network: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతోంది. ఇప్పటికే రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా వాటి ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చేస్తూ ఏపీ విన్నపానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైలు మార్గాన్ని ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, పారిశ్రామిక కేంద్రం నాయుడుపేట మీదుగా మళ్లించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనివల్ల ఏపీ రాజధాని అమరావతికి రెండు వైపుల నుండి హైస్పీడ్ రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్నే మార్చేసే అవకాశం ఉంది.

నిజానికి గతంలో రూపొందించిన ప్లాన్ ప్రకారం బెంగళూరు-చెన్నై కారిడార్ చిత్తూరు జిల్లా మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో, ఈ మార్గాన్ని తిరుపతి  నాయుడుపేటలను తాకుతూ వెళ్లేలా మార్పులు చేశారు. ఇలా చేయడం వల్ల భక్తులకు, పర్యాటకులకు ఎంతో మేలు జరుగుతుంది. తిరుపతికి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుండి ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఈ ప్రతిపాదనకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించడంతో వచ్చే ఏడాది నాటికి దీనికి సంబంధించిన పూర్తి నివేదిక  సిద్ధం కానుంది.

హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లే మరో హైస్పీడ్ కారిడార్ ఇప్పటికే అమరావతి మీదుగా వెళ్లాలని నిర్ణయించారు. ఈ మార్గం పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు మీదుగా చెన్నైకి చేరుకుంటుంది. ఇప్పుడు బెంగళూరు-చెన్నై మార్గం కూడా నాయుడుపేట వద్ద కలవడం వల్ల, అమరావతి నుండి అటు బెంగళూరుకు, ఇటు మైసూర్ వరకు హైస్పీడ్ రైలు ప్రయాణం సాధ్యమవుతుంది. అంటే అమరావతి నగరం రెండు ప్రధాన ఆర్థిక కారిడార్లకు కూడలిగా మారబోతోంది. దీనివల్ల రాష్ట్ర రాజధానికి పెట్టుబడులు పెరగడంతో పాటు వ్యాపార రంగం కూడా పుంజుకుంటుంది.

రాయలసీమ ప్రాంతానికి కూడా ఈ ప్రాజెక్టులతో భారీ ప్రయోజనం కలగనుంది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల మీదుగా వెళ్తుండగా, కొత్తగా చేరిన తిరుపతి లింక్ వల్ల చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు కూడా హైస్పీడ్ రైలు కనెక్టివిటీ లభిస్తుంది. ఇలా ఉత్తరాంధ్ర మినహా దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలు ఈ బుల్లెట్ రైలు వేగాన్ని అందుకోబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలను కలిపే ఈ నెట్‌వర్క్ దక్షిణ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా అవతరించనుంది.

రాష్ట్ర విభజన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఒక వరం లాంటిదే. హైస్పీడ్ రైళ్ల వల్ల గంటల ప్రయాణం నిమిషాల్లోకి మారుతుంది. ఇది కేవలం ప్రయాణికులకే కాకుండా, స్థానిక ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు తరలించేందుకు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే, ఏపీ రవాణా రంగంలో ఒక కొత్త శకం మొదలైనట్టే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Spotlight

Read More →