Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్! Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! South Central Railway: ఏపీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ స్పెషల్ రైళ్లన్నీ రెగ్యులర్! Traffic Alert: ప్రయాణికులకు అలెర్ట్... రేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు! ట్రయల్ రన్... 108 Services: దోర్నాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... 108 సిబ్బంది సకాలంలో స్పందనతో తప్పిన ప్రాణాపాయం! IRCTC: వేసవిలో వైజాగ్ - అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.... New Flight Services: విజయవాడ టు హైదరాబాద్... రెండు కొత్త విమాన సర్వీసులు! Tiger Scare: రామదుర్గం కొండల్లో హైటెన్షన్... పులి సంచారంతో చిక్కుకుపోయిన 50 మంది పర్యాటకులు! Indian Railways: ప్రయాణికులకు షాక్.. నేటి నుంచే అమల్లోకి కొత్త రూల్స్.. 8 గంటలలోపు - భారతీయ రైల్వే కఠిన నిర్ణయం.! FASTag: టోల్ ప్లాజాల వద్ద క్యాష్ నో ఎంట్రీ.... ఇక అంతా డిజిటల్ పేమెంట్లే! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్! Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! South Central Railway: ఏపీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ స్పెషల్ రైళ్లన్నీ రెగ్యులర్! Traffic Alert: ప్రయాణికులకు అలెర్ట్... రేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు! ట్రయల్ రన్... 108 Services: దోర్నాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... 108 సిబ్బంది సకాలంలో స్పందనతో తప్పిన ప్రాణాపాయం! IRCTC: వేసవిలో వైజాగ్ - అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.... New Flight Services: విజయవాడ టు హైదరాబాద్... రెండు కొత్త విమాన సర్వీసులు! Tiger Scare: రామదుర్గం కొండల్లో హైటెన్షన్... పులి సంచారంతో చిక్కుకుపోయిన 50 మంది పర్యాటకులు! Indian Railways: ప్రయాణికులకు షాక్.. నేటి నుంచే అమల్లోకి కొత్త రూల్స్.. 8 గంటలలోపు - భారతీయ రైల్వే కఠిన నిర్ణయం.! FASTag: టోల్ ప్లాజాల వద్ద క్యాష్ నో ఎంట్రీ.... ఇక అంతా డిజిటల్ పేమెంట్లే!

Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్!

Puri International Airport Updates: పూరీలో శ్రీ జగన్నాథ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం స్టేజ్-1 అటవీ అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ మెగా ప్రాజెక్టు వల్ల పర్యాటక రంగం రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉండనుంది.

Published : 2026-04-04 16:21:00

Puri International Airport Updates: ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలనే  దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర పర్యావరణ  అటవీ శాఖ దీనికి సంబంధించిన 'స్టేజ్-1' క్లియరెన్స్‌ను అధికారికంగా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినట్లు తెలుస్తోంది. శ్రీ జగన్నాథ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో పిలిచే ఈ భారీ ప్రాజెక్టు వల్ల పూరీకి ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణ సదుపాయాలు మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది.

ఈ విమానాశ్రయ నిర్మాణం కోసం పూరీ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని సుమారు 27 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించే ప్రక్రియ జరుగుతోంది. 1980 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం ఒక ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం మొదటి దశ అనుమతి మాత్రమేనని, పూర్తిస్థాయి పనులు మొదలవ్వాలంటే కేంద్రం విధించిన కొన్ని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని  పేర్కొంటున్నారు. అటవీ ప్రాంతాన్ని వాడుకుంటున్నందుకు బదులుగా వేరే చోట పర్యావరణాన్ని కాపాడే చర్యలు చేపట్టాలని కేంద్రం సూచిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పూరీకి వెళ్లే భక్తులు భువనేశ్వర్ విమానాశ్రయంలో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుండి నేరుగా పూరీకి విమానాల్లో చేరుకునే వీలుంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా, విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జగన్నాథుడిని దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇది ఒక శుభవార్తగా మారుతుందని భావిస్తున్నారు.

కేవలం ఒడిశాలోనే కాకుండా దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం వేగంగా పనులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, గుజరాత్‌లోని ధోలేరా  రాజస్థాన్‌లోని కోట వంటి నగరాల్లో కూడా కొత్త విమానాశ్రయాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎయిర్‌పోర్ట్‌లన్నీ 2026 నాటికి లేదా ఆ తర్వాత అందుబాటులోకి  రానున్నాయి.. దీనివల్ల సామాన్య ప్రజలకు రవాణా సౌకర్యాలు పెరగడమే కాకుండా, ఆయా ప్రాంతాల్లో వ్యాపార  పారిశ్రామిక రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం  ఉండనుంది. 

పూరీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అటవీ అనుమతులు రావడంతో పనులు త్వరలోనే ఊపందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పర్యావరణ నియమాలను పాటిస్తూనే అత్యాధునిక వసతులతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇది పూర్తయితే పూరీ ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారి వేలమందికి ఉపాధి కల్పిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. రవాణా వ్యవస్థలో వచ్చే ఈ మార్పు ఒడిశా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక పెద్ద ఊతం ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →