- Sports: ఐపీఎల్లో సంజూ శాంసన్ నాలుగో సెంచరీ: ఢిల్లీ క్యాపిటల్స్పై అద్భుత రికార్డు..
- ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం: చెపాక్ కోటలో సింహంలా గర్జించిన సంజూ శాంసన్..
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతున్న ఈ పోరులో శాంసన్ విధ్వంసక సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 115 పరుగులు సాధించి చెన్నై జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ కెరీర్లో శాంసన్కు ఇది నాలుగో సెంచరీ కాగా, ప్రస్తుత సీజన్లో ఇదే తొలి శతకం కావడం విశేషం. సంజూ అద్భుత ఇన్నింగ్స్కు తోడు యువ ఆటగాడు ఆయుష్ మాత్రే అర్ధశతకంతో మెరవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ, చెన్నై బ్యాటర్లు అతని నిర్ణయాన్ని తలకిందులు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 18 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆయుష్ మాత్రేతో కలిసి రెండో వికెట్కు ఏకంగా 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మాత్రే 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి 'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరిగాడు. ఆఖర్లో శివమ్ దూబే కేవలం 10 బంతుల్లోనే 20 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో చెన్నై స్కోరు 200 మార్కును సులువుగా దాటేసింది.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెన్నై బ్యాటర్ల దాటికి పూర్తిగా చేతులెత్తేశారు. స్టార్ బౌలర్ టి. నటరాజన్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకోగా, లుంగి ఎంగిడి 41 పరుగులు ఇచ్చి భారీగా పరుగులు రాబట్టాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టినప్పటికీ, 39 పరుగులు ఇచ్చి ఖరీదైన బౌలర్గా నిలిచాడు. చెపాక్ మైదానంలో పరుగుల వర్షం కురవడంతో ఢిల్లీ ముందు 213 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. శాంసన్ తన క్లాస్ మరియు పవర్ హిట్టింగ్తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన తీరు ఈ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది.