బెంగాల్లో లో టీఎంసీకి గట్టి పోటీ ఇస్తున్న BJP..
భవానీపూర్ లో వెనుకంజలో మమతా బెనర్జీ..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మ్యాజిక్ ఫిగర్ దాటేసి అధికారానికి దగ్గరపడుతున్నట్టు తాజా లెక్కింపులు సూచిస్తున్నాయి. తొలిసారిగా బెంగాల్లో అధికార పీఠం వైపు బీజేపీ దూసుకెళ్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ ఫలితాల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు కీలకంగా పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. “దీదీ కోట”గా పేరుగాంచిన అల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది.
ఇక సీఎం రేసులో సువెందు అధికారి మరియు దిలీప్ ఘోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సువేందు అధికారి పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారని సమాచారం. నందిగ్రం తో పాటు భవనీపూర్ లో కూడా ఆయన ముందంజలో ఉన్నట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి.
ఇక మరోవైపు సీఎం మమతా బనర్జీ పరిస్థితి ఉత్కంఠగా మారింది. భవానీపూర్లో ఆమె వెనుకంజలో ఉన్నారనే వార్తలు వస్తుండగా, మరోవైపు కొన్ని ట్రెండ్స్లో ఆధిక్యంలో ఉన్నారనే సమాచారం కూడా వినిపిస్తోంది. నందిగ్రామ్లో మాత్రం సువేందు ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.
టీఎంసీ కార్యాలయాల వద్ద సాధారణంగా కనిపించే హడావుడి ఈసారి కనిపించకపోవడం గమనార్హం. అలాగే మమతా బెనర్జీ నివాసం వద్ద కూడా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతూ, రాష్ట్ర రాజకీయ దిశను పూర్తిగా మార్చేలా కనిపిస్తున్నాయి.