Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్!

TDP: పెద్ద దస్తగిరి హత్య వెనుక భూ కుంభకోణం? జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర ఆరోపణలు!

TDP: కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Published : 2026-04-23 18:15:00

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి..

పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు జగన్?

మంగళగిరి: కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో భాగంగానే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆయన అన్నారు.

రెండు వారాల క్రితం కడప పట్టణంలో జరిగిన ఈ హత్యను కొంతమంది మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే ఈ హత్య కూడా జరిగిందని పోల్చారు. “మొదట గుండెపోటు అని చెప్పి, తరువాత గొడ్డలి దాడి జరిగినట్టు చెప్పినట్లే... ఇప్పుడు కూడా నిజాలను మసకబార్చే ప్రయత్నం జరుగుతోంది” అని విమర్శించారు.

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలోనే ఈ హత్య జరిగిందని ఆయన పేర్కొన్నారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డికి బినామీగా పని చేస్తూ పెద్ద స్థాయిలో భూ దందాలు చేశారని ఆరోపించారు. పెద్ద దస్తగిరి పేరుతో వందల కోట్ల ఆస్తులు పెట్టి, ఆ లావాదేవీలలో తలెత్తిన వివాదాల వల్లే ఈ హత్య జరిగిందని చెప్పారు.

ఈ ఘటనపై వైసీపీ నేతలు సరైన స్పందన ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. “ఇతరులు చనిపోతే వెంటనే పరామర్శించే జగన్... పులివెందులలో ఉండి కూడా పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు?” అని నిలదీశారు. హత్యను ఖండించకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రవీంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి వ్యాపారాలు లేకపోయినా వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రాయలసీమకు నీళ్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను కూడా భూమిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. 2020లో రూ.3,885 కోట్లతో లిఫ్ట్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి, పర్యావరణ అనుమతులు లేకుండానే టెండర్లు ఇచ్చారని అన్నారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీకి ఈ పనులు అప్పగించారని ఆరోపించారు.

తరువాత నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఈ ప్రాజెక్టుపై స్టే ఇచ్చినా కూడా రూ.900 కోట్ల బిల్లులు డ్రా చేసుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఎన్జీటీ రూ.2.65 కోట్ల జరిమానా కూడా విధించిందని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అసలు లక్ష్యం రాయలసీమకు నీళ్లు ఇవ్వడం కాదని, చెన్నైకి తాగునీరు అందించడమేనని ఆరోపించారు. ఈ విషయాన్ని 2023లో జీఓల ద్వారా స్పష్టం చేశారని తెలిపారు.

రాయలసీమకు జరిగిన అన్యాయంపై భూమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. “2019-24 మధ్య ఒక ఆయకట్టుకైనా అదనంగా నీరు ఇచ్చినట్టు నిరూపిస్తే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను” అని సవాల్ విసిరారు. అలాగే, వేదవతి, గుండ్రేవుల వంటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, మొత్తం 102 సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసిందని ఆరోపించారు. ఇది రాయలసీమకు చేసిన తీరని ద్రోహమని వ్యాఖ్యానించారు.

పెద్ద దస్తగిరి హత్య, భూ దందాలు, రాయలసీమ నీటి సమస్యలపై భూమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Spotlight

Read More →