Lok Sabha seats: 33 శాతం రిజర్వేషన్లు.. 15 ఏళ్ల అమలు.. సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన.. Lok Sabha: రేపు, ఎల్లుండి లోక్‌సభలో ఓటింగ్.. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఉత్కంఠ నిరీక్షణ.! Chandrababu: సీనియర్ల అనుభవం - యువత ఉత్సాహం.. సామాజిక న్యాయమే ప్రాతిపదికగా టీడీపీ కొత్త కమిటీలు.. Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి.. తిరుపతి వేదికగా క్రీడాభివృద్ధికి సరికొత్త రోడ్ మ్యాప్! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేష్ భేటీ! ఏపీలో క్రీడల అభివృద్ధికి సరికొత్త ప్లాన్..! Praja Vedika: రేపు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tdp new Committee: మంగళగిరి ఎమ్మెల్యే టు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా! జాతీయ కమిటీలో కీలక నియామకాలు ఇవే...! Minister Narayana: తండ్రికి తగ్గ తనయుడు.. లోకేష్‌కు సరికొత్త బాధ్యతలు.. మంత్రి నారాయణ హర్షం! Nara Lokesh: 12 ఏళ్ల త‌రువాత‌ మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణతతో స‌రికొత్త రికార్డు! లోకేష్ ప్ర‌ణాళిక‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో.. Lok Sabha seats: 33 శాతం రిజర్వేషన్లు.. 15 ఏళ్ల అమలు.. సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన.. Lok Sabha: రేపు, ఎల్లుండి లోక్‌సభలో ఓటింగ్.. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఉత్కంఠ నిరీక్షణ.! Chandrababu: సీనియర్ల అనుభవం - యువత ఉత్సాహం.. సామాజిక న్యాయమే ప్రాతిపదికగా టీడీపీ కొత్త కమిటీలు.. Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి.. తిరుపతి వేదికగా క్రీడాభివృద్ధికి సరికొత్త రోడ్ మ్యాప్! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేష్ భేటీ! ఏపీలో క్రీడల అభివృద్ధికి సరికొత్త ప్లాన్..! Praja Vedika: రేపు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tdp new Committee: మంగళగిరి ఎమ్మెల్యే టు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా! జాతీయ కమిటీలో కీలక నియామకాలు ఇవే...! Minister Narayana: తండ్రికి తగ్గ తనయుడు.. లోకేష్‌కు సరికొత్త బాధ్యతలు.. మంత్రి నారాయణ హర్షం! Nara Lokesh: 12 ఏళ్ల త‌రువాత‌ మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణతతో స‌రికొత్త రికార్డు! లోకేష్ ప్ర‌ణాళిక‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో..

Lok Sabha: రేపు, ఎల్లుండి లోక్‌సభలో ఓటింగ్.. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఉత్కంఠ నిరీక్షణ.!

Parliament: పార్లమెంట్ వేదికగా రేపు అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. దేశ భవిష్యత్తును, ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే మూడు ప్రధాన బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇందులో భాగంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, మరియు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Published : 2026-04-15 22:05:00
  • "18న రాజ్యసభలో తుది ఘట్టం": చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానంపై చారిత్రక ఓటింగ్..
     
  • Politics: 131వ రాజ్యాంగ సవరణతో మారనున్న రాజకీయం: దశాబ్దాల 'సీట్ల స్తంభన'కు చెక్!

Women Voting Bill: పార్లమెంట్ వేదికగా రేపు అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. దేశ భవిష్యత్తును, ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే మూడు ప్రధాన బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇందులో భాగంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, మరియు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యపై దశాబ్దాలుగా ఉన్న 'ఫ్రీజ్' (స్తంభన)ను తొలగించే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ చారిత్రక సవరణ అనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో లోక్‌సభ ఎంపీ సీట్ల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుండి ఏకంగా 850కి పెరగనుంది. కొత్త లెక్కల ప్రకారం రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు (UTs) 35 స్థానాలను కేటాయించనున్నారు. ఈ మార్పులన్నీ పూర్తయి, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పెరిగిన నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై రేపు పార్లమెంట్‌లో కీలక చర్చ జరగనుంది. ఈ చారిత్రక బిల్లుపై సమగ్ర విశ్లేషణ కోసం ప్రభుత్వం ఉభయ సభల్లోనూ తగిన సమయాన్ని కేటాయించింది. లోక్‌సభలో 18 గంటల పాటు, రాజ్యసభలో 10 గంటల పాటు ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యాలను ఆయన వివరించనున్నారు. ఈ కీలక చర్చల అనంతరం బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.

బిల్లులకు సంబంధించి పార్లమెంట్‌లో ఓటింగ్ షెడ్యూల్ కూడా ఖరారైంది. రేపు మరియు ఎల్లుండి లోక్‌సభలో ఈ బిల్లులపై సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన అనంతరం, ఈ నెల 18వ తేదీన రాజ్యసభలో ఓటింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఉభయ సభల ఆమోదం పొందితే, దేశ రాజకీయ ముఖచిత్రంలో ఒక నూతన అధ్యాయం మొదలుకానుంది. నియోజకవర్గాల సంఖ్య పెరగడం మరియు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లభించడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Spotlight

Read More →