మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు గట్టి నమ్మకం..
ఎన్డీఏ తరఫున గెలిచిన అభ్యర్థులందరికీ చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు..
దేశవ్యాప్తంగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు భారీ మద్దతు తెలుపుతున్నారని, ఇది చారిత్రాత్మక ప్రజా తీర్పుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు గట్టి నమ్మకం పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. “వికసిత్ భారత్” లక్ష్యంతో ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, ఆ దిశగా ఈ ఫలితాలు మరింత బలం చేకూరుస్తాయని తెలిపారు.
“సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” అనే నినాదంతో ఎన్డీఏ ముందుకు సాగుతోందని, అదే స్ఫూర్తి ఈ విజయానికి కారణమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు దేశాన్ని అభివృద్ధి దిశగా మరింత వేగంగా నడిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్డీఏ తరఫున గెలిచిన అభ్యర్థులందరికీ చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే పార్టీ నాయకుడు నితిన్ నబిన్ లకు కూడా చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్డీఏ విజయాన్ని ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంటూ, భవిష్యత్తులో అభివృద్ధి లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.