Chandrababu: మాచర్ల ఘటనపై చంద్రబాబు సీరియస్.. నిందితుడికి నరకం చూపించాలి... Amaravati Capital: రాజధానిపై 9 సార్లు మాట మార్చారు.. మీకా విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు? Kollu Ravindra: విజయవాడలో ఏఐ సమ్మిట్ ప్రారంభం! 25 ఏళ్ల క్రితమే ఏఐ విజన్‌ను చూసిన చంద్రబాబు- కొల్లు రవీంద్ర! AP Govt: 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. సరికొత్త రూపం.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నూతన మ్యాప్! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Chandrababu: మాచర్ల ఘటనపై చంద్రబాబు సీరియస్.. నిందితుడికి నరకం చూపించాలి... Amaravati Capital: రాజధానిపై 9 సార్లు మాట మార్చారు.. మీకా విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు? Kollu Ravindra: విజయవాడలో ఏఐ సమ్మిట్ ప్రారంభం! 25 ఏళ్ల క్రితమే ఏఐ విజన్‌ను చూసిన చంద్రబాబు- కొల్లు రవీంద్ర! AP Govt: 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. సరికొత్త రూపం.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నూతన మ్యాప్! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం..

Chandrababu: గీత దాటితే సస్పెన్షనే.. జాప్రతినిధుల భవిష్యత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేతలపై అధినేత కన్నెర్ర..

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీలో క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. శనివారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, వెంటనే సస్పెండ్ చేస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

Published : 2026-04-04 00:00:00
  • "పనితీరు మార్చుకోవాల్సిందే": వివాదాలకు దూరంగా ఉండాలని ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశం..
     
  • Politics: టీడీపీలో క్రమశిక్షణపై ఉక్కుపాదం: నేతల ప్రవర్తనపై డేగకన్ను వేసిన చంద్రబాబు..

Amaravati Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీలో క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. శనివారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, వెంటనే సస్పెండ్ చేస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై ఇచ్చిన వివరణను పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి ముందు ఉంచగా, ఈ సందర్భంగా చంద్రబాబు నేతల ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టడానికి తాను సిద్ధంగా లేనని, గీత దాటి ప్రవర్తించే వారిని ఇకపై భరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

పార్టీకి మరియు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఏ ఒక్కరి విషయంలోనూ పునరాలోచన లేకుండా సస్పెన్షన్ వేటు వేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి ప్రజాప్రతినిధి క్రమశిక్షణతో ఉంటూ సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగాలని ఆకాంక్షించాలని, కేవలం ఒక్కసారే ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారా లేదా అనేది వారే తేల్చుకోవాలని సూచించారు. ప్రజా సేవలో నిమగ్నమై ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంపై దృష్టి పెట్టాలని, అంతర్గత కలహాలు లేదా వివాదాలకు తావు లేకుండా పనితీరు మార్చుకోవాలని ఆయన ఆదేశించారు. పదవి కంటే క్రమశిక్షణే ముఖ్యమని, పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Spotlight

Read More →