ఎన్నారై టీడీపీ అభిమానుల మధ్య జయరామ్ కోమటి ఆత్మీయ భేటీ..
ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతల అనంతరం జయరామ్ కోమటి తొలి పర్యటన..
ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా శాన్ ఫ్రాన్సిస్కోకు వచ్చిన జయరామ్ కోమటికి అక్కడి ఎన్నారై టీడీపీ అభిమానులు, తెలుగు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పూలదండలతో స్వాగతం తెలుపుతూ, అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. జయరామ్ కోమటి రాకను సందర్భంగా చేసుకుని స్థానిక తెలుగు సమాజం పెద్ద ఎత్తున హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఉత్తర అమెరికాలో తెలుగు సమాజంతో సమన్వయం పెంచుతూ, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆశిస్తున్నామని పలువురు పేర్కొన్నారు.
జయరామ్ కోమటి మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలతో మరింత సన్నిహితంగా పని చేయాలని తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం ఎంతో కీలకమని, వారి సూచనలు, అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేస్తానని తెలిపారు.
ఈ స్వాగత కార్యక్రమంలో వెంకట్ కోగంటి, వీరు ఉప్పల, విజయ ఆసూరి, శ్రీనివాస్ తడపనేని, ప్రసాద్ మంగిన, విజయ్ గుమ్మడి, బిర్యానీ జంక్షన్ వెంకట్, కరుణ్ వెలిగేటి, కళ్యాణ్ కట్టమూరి, రాజశేఖర్ పర్వతనేని, శ్రీని వల్లూరిపల్లి, వెంకట్ మద్దిపాటి, రాధిక, జగదీష్ గింజుపల్లి, భాస్కర్ అన్నే, విజయ్ రెడ్డి జెట్టి, శ్రీనివాస్ వట్టికూటి, మోహన్ మల్లెంపాటి, భరత్ ముప్పీరాల, రమేష్ మల్లరపు, రామ్ తోట, నరేందర్ రెడ్డి యెన్నంరెడ్డి, రాంబాబు మానుకొండ, దీప్తి సాహు, కిశోర్ తాడికొండ, హరి సన్నిధి, తిరుపతిరావు వలివేటి, శివ అద్దంకి, యశస్వి మాధవ, సందీప్ ఇంటూరి, వంశి కందుల, రవి కిరణ్ యేలేటి, మహేంద్ర కూచిపూడి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం మొత్తం ఆత్మీయత, ఉత్సాహంతో నిండిపోగా, విదేశాల్లో ఉన్న తెలుగు వారి ఐక్యతకు ఇది మరో మంచి ఉదాహరణగా నిలిచింది.