Donald Trump: పశ్చిమాసియాలో ముదురుతున్న మాటల యుద్ధం.. కాల్పుల విరమణ ఉన్నా తగ్గని ఇరాన్-అమెరికా సెగ.! Gold Rate Today: నేడు బంగారం కొనాలనుకుంటున్నారా? మే 1వ తేదీ నాటి లేటెస్ట్ రేట్ల వివరాలు ఇవే.! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Jio Recharge: జియో షాకింగ్ రీఛార్జ్ ప్లాన్స్... రూ. 200 లోపే అదిరిపోయే ప్లాన్స్.. డేటా, కాల్స్ అన్నీ ఫ్రీ! Fish Side Effects: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చేపలు తింటే ప్రాణాలకే ప్రమాదం! Ashu reddy: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.! కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి... Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం. Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Donald Trump: పశ్చిమాసియాలో ముదురుతున్న మాటల యుద్ధం.. కాల్పుల విరమణ ఉన్నా తగ్గని ఇరాన్-అమెరికా సెగ.! Gold Rate Today: నేడు బంగారం కొనాలనుకుంటున్నారా? మే 1వ తేదీ నాటి లేటెస్ట్ రేట్ల వివరాలు ఇవే.! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Jio Recharge: జియో షాకింగ్ రీఛార్జ్ ప్లాన్స్... రూ. 200 లోపే అదిరిపోయే ప్లాన్స్.. డేటా, కాల్స్ అన్నీ ఫ్రీ! Fish Side Effects: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చేపలు తింటే ప్రాణాలకే ప్రమాదం! Ashu reddy: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.! కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి... Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం. Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని!

Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.!

Vizag Steel Plant: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కి, ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనుంది. గత ఏడాది అందించిన రూ. 11,440 కోట్ల సాయానికి అదనంగా, ఇప్పుడు మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ఉక్కు శాఖ రంగం సిద్ధం చేసింది.

Published : 2026-05-01 20:04:00
  • ఇప్పటికే తొలి దశలో రూ. 11,440 కోట్ల ప్యాకేజీ అందించిన కేంద్రం..
     
  • Politics: విశాఖ ప్లాంట్ లో గణనీయంగా పెరిగిన ఉత్పత్తి, అమ్మకాలు..

Vizag Steel Plant: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కి, ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గత ఏడాది అందించిన రూ. 11,440 కోట్ల సాయానికి అదనంగా, ఇప్పుడు మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించేందుకు కేంద్ర ఉక్కు శాఖ రంగం సిద్ధం చేసింది. ఈ నిధుల ద్వారా ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో లాభాల బాటలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ ప్యాకేజీకి సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేసి, ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించారు. ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం దీనికి పచ్చజెండా ఊపిన వెంటనే, ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుంది.

తొలి దశలో అందించిన సాయం తరహాలోనే, ఈ రూ. 8,097 కోట్లను కూడా ఈక్విటీ రూపంలోనే సమకూర్చాలని కేంద్రం నిర్ణయించడం విశేషం. దీనివల్ల ప్లాంట్‌పై అదనపు రుణ భారం పడకుండా, మూలధనం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిపిన సంప్రదింపుల ఫలితంగానే తొలి విడతలో రూ. 11,440 కోట్ల ప్యాకేజీ సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పట్లో అందిన నిధులలో రూ. 10,300 కోట్లు ఈక్విటీగా, మిగిలిన రూ. 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాల రూపంలో అందాయి. ఈ నిధుల సహకారంతో స్టీల్‌ప్లాంట్‌లో ప్రస్తుతం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు అందుబాటులోకి వచ్చి, ఉత్పత్తి మరియు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మొదలైన ఈ పురోగతి దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే అదనపు నిధుల అవసరం ఉందని కేంద్రం గుర్తించింది. ఈ రెండో దశ ప్యాకేజీ విడుదలైతే ప్లాంట్ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం వేలాది మంది కార్మికులకు మరియు వారి కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోంది.

Spotlight

Read More →