లోకేష్ నాయకత్వంలో పార్టీకి కొత్త ఉత్సాహం..
యువ నాయకత్వంపై నమ్మకం..
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా యువనేత నారా లోకేష్ ఎంపిక కావడంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు, నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుచ్చి రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, రాష్ట్ర కార్యదర్శి కోడూరి అఖిల్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఏవీ రమణ, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి కూడా హాజరయ్యారు. ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు.
లోకేష్ నాయకత్వంలో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. యువతను కలుపుకొని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. పార్టీని కొత్త దిశలో నడిపిస్తూ, భవిష్యత్తులో విజయ తీరాలకు తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
లోకేష్ నియామకంతో టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. కార్యకర్తల ఉత్సాహం, నాయకుల నమ్మకంతో పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.