Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి తగ్గిన నిరీక్షణ సమయం! TTD లో ఈ విధంగా విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం!! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఇంకా 12 గంటల సమయం! Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు, యాపిల్ టాబ్స్ విరాళంగా అందించిన నీరా రాడియా! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి తగ్గిన నిరీక్షణ సమయం! TTD లో ఈ విధంగా విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం!! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఇంకా 12 గంటల సమయం! Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు, యాపిల్ టాబ్స్ విరాళంగా అందించిన నీరా రాడియా! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక!

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం!

Godavari Pushkaralu: ఆంధ్రప్రదేశ్‌లో 2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.

Published : 2026-06-02 19:26:00

గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష..

2027 పుష్కరాల కోసం 525 ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధం..

ఆంధ్రప్రదేశ్‌లో 2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టు, పుష్కరాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రుల కమిటీతో కలిసి సీఎం విస్తృతంగా చర్చించారు.

పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని సూచించారు.

పుష్కరాల నిర్వహణను కేవలం తాత్కాలిక కార్యక్రమంగా కాకుండా, గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం తెలిపారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం వంటి నగరాలను మెగాసిటీలుగా తీర్చిదిద్దే దిశగా పనులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న మౌలిక వసతులు భవిష్యత్తులో ప్రజలకు శాశ్వత ఆస్తులుగా మారాలని అభిప్రాయపడ్డారు.

పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ స్థాయిలో పుష్కరాల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 212 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరి నదికి అనుసంధానంగా మొత్తం 525 పుష్కర ఘాట్లను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లకు అదనంగా కొత్తగా 237 ఘాట్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

పోలవరం జిల్లా గుండాలలో తొలి పుష్కర ఘాట్ ఏర్పాటు చేయనుండగా, కోనసీమ జిల్లా అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలోని గోవాలంక, పశ్చిమగోదావరిలోని నర్సాపురం ప్రాంతాల్లో చివరి ఘాట్‌ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో 150కి పైగా కొత్త ఘాట్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం 4.5 కిలోమీటర్ల పొడవున్న పుష్కర ఘాట్లను కొత్త నిర్మాణాలతో కలిపి 9.9 కిలోమీటర్లకు విస్తరించనున్నారు.

ఈసారి గోదావరి పుష్కరాలకు 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒక్కరోజులోనే సుమారు కోటి మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతంలో 1991లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1.2 కోట్ల మంది, 2003లో 5 కోట్ల మంది, 2015లో నవ్యాంధ్రప్రదేశ్‌లో 4.86 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. గత పుష్కరాల్లో ఒక్కరోజులో అత్యధికంగా 58.26 లక్షల మంది భక్తులు స్నానం చేశారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర ఘాట్లు, రహదారులు, తాత్కాలిక టెంట్లు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాజమహేంద్రవరం, నర్సాపురం తదితర పట్టణాల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.1,974 కోట్ల వ్యయంతో 1,660 పనులు చేపట్టనున్నారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.1,080 కోట్ల విలువైన 1,140 పనులు అమలు చేయనున్నారు. ఇప్పటికే రూ.211.97 కోట్లతో 132 పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, హోంమంత్రి అనిత, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. సీఎస్ జి.సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా దేవాదాయ, వైద్యారోగ్యం, రవాణా, పర్యాటక, పురపాలక, పంచాయతీరాజ్, ఆర్థిక, జలవనరులు, పోలీసు శాఖల ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

Spotlight

Read More →