ఎయిరిండియా విమానంలో ప్రయాణించాల్సిన సుమారు వందకుపైగా ప్రయాణికులు.. థాయ్ల్యాండ్లోని పుకెట్లో చిక్కుకున్నారు. సుమారు మూడు రోజుల నుంచి ఆ ప్రయాణికులు అక్కడే ఉంటున్నారు. సాంకేతిక లోపం వల్ల ఎయిరిండియా విమానం దాదాపు 80 గంటలుగా అక్కడే నిలిచిపోయింది. నవంబర్ 16వ తేదీన ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానం.. ఆరు గంటలకు ఆలస్యంగా వెళ్లనున్నట్లు తొలుత ప్రకటించారు. ఎయిర్పోర్టులో చాలా సమయం ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఆ తర్వాత ప్లేన్ దిగిపోవాలని ప్రయాణికుల్ని కోరారు. ఆ తర్వాత ఫ్లయిట్ను రద్దు చేశారు.
ఇంకా చదవండి: నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సాంకేతిక లోపం తలెత్తిన విమానంలోనే తీసుకెళ్లనున్నట్లు తొలుత చెప్పారు. కానీ ఆ ప్లేన్లో ఉన్న సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు. ప్లేన్ టేకాఫ్ తీసుకున్న తర్వాత రెండున్నర గంటల్లోనే పుకెట్లో ల్యాండ్ చేశారు. సాంకేతిక లోపం వల్ల విమానాన్ని దించినట్లు చెప్పారు. అప్పటి నుంచి ప్రయాణికులు పుకెట్ లోనే ఎదురుచూస్తున్నారు. 16వ తేదీన డ్యూటీ టైం దాటడంతో విమానాన్ని నడపలేకపోయినట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. అయితే 17వ తేదీన విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రయాణికులకు బస ఏర్పాటు చేసినట్లు ఎయిరిండియా అధికారి వెల్లడించారు. ప్రయాణికులకు రీఎంబర్స్మెంట్ చేశామని, అనేక మంది ప్రయాణికులు ఇంకా చిక్కుకున్నారని, పుకెట్లో ఉన్న ప్రయాణికుల్ని వెనక్కి తీసుకువస్తామని ఓ అధికారి చెప్పారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: