కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గత 6 నెలల్లోనే గణనీయంగా పెరిగిన విమాన ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా కొత్త సర్వీసులు రాబోతున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త సర్వీసులు ప్రారంభం కాగా తాజాగా రాష్ట్రానికి మరో 2 కొత్త సర్వీసులు మంజూరయ్యాయి. రాజమండ్రి - ముంబై - రాజమండ్రి(6ఈ 582/3), తిరుపతి - ముంబై తిరుపతి(6ఈ 532/3) మధ్య డిసెంబర్ 2 నుంచి కొత్తగా విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
రాజమండ్రి - ముంబై - రాజమండ్రి విమానం ప్రతి రోజూ సాయంత్రం 4.50 గంటలకు ముంబైలో బయలుదేరి 6.45 గంటలకు రాజమండ్రి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.15 గంటలకు ప్రారంభమై, 9.05 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. మరో విమానం ఉదయం 5.30 గంటలకు ముంబైలో ప్రారంభమై, 7.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి 7.45 గంటలకు ప్రారంభమై, 9.25 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఈ 2 నగరాల నుంచి ముంబై చేరుకోవాల్సి వస్తే.. హైదరాబాద్ మీదుగా చేరుకోవాల్సి ఉండేది. తాజా సర్వీసులతో ప్రయాణ సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?
ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!
విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!
బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!
మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: