దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
బ్లూంఫోంటీన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 295 పరుగులు చేసింది.
వన్ డౌన్ బ్యాట్స్ మన్ ముషీర్ ఖాన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముషీర్ 126 బంతుల్లో 131 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 52, కెప్టెన్ ఉదయ్ సహారన్ 34 పరుగులు చేశారు. తెలుగుతేజం, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఆరవెల్లి అవినాశ్ 2 సిక్సులు బాది 17 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో మాసన్ క్లార్క్ 4 వికెట్లు తీశాడు. ర్యాన్ సొర్గాస్ 1, ఇవాల్డ్ ష్రూడర్ 1, జాక్ కమ్మింగ్ 1, ఒలివర్ తెవాటియా 1 వికెట్ పడగొట్టారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి