AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Black Coffee: బ్లాక్ కాఫీతోనే అసలైన ఆరోగ్యం.. పాలు, పంచదార కలిపితే విషమేనా? షాకింగ్ రిపోర్ట్! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Black Coffee: బ్లాక్ కాఫీతోనే అసలైన ఆరోగ్యం.. పాలు, పంచదార కలిపితే విషమేనా? షాకింగ్ రిపోర్ట్! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్..

Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం!

Chandrababu New House: ఈ గృహ నిర్మాణం కేవలం ఒక నివాసానికే పరిమితం కాకుండా, ప్రభుత్వ మరియు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా 'ప్రజా భవన్'ను కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు. సుమారు 25 వేల చదరపు గజాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ భవనం చుట్టూ అత్యధిక భాగం పచ్చదనానికి (గార్డెన్) కేటాయించారు.

Published : 2026-04-24 08:04:00

Politics- వెలగపూడిలో వెలుగులు: అత్యాధునిక వసతులతో ప్రజా భవన్ నిర్మాణం.

ఏడాదిలోనే అద్భుతం - చెట్ల పొదల నుంచి రాజప్రాసాదం వరకు!

చంద్రబాబు ఇంటి పక్కనే మంత్రి నారాయణ నివాసం - ముస్తాబవుతున్న ఈ6 రోడ్డు.

Chandrababu New House: రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఇంటి కల సాకారమవుతోంది. గతేడాది ఏప్రిల్ 9న వెలగపూడి గ్రామ పరిధిలో శంకుస్థాపన చేసిన ఈ భవన నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. గతంలో చెట్లు, పొదలతో నిండిన ఈ ప్రాంతం కేవలం ఏడాది కాలంలోనే ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం పట్టుదలతో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుండటంతో, రాబోయే రెండు మూడు నెలల్లోనే గృహప్రవేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ గృహ నిర్మాణం కేవలం ఒక నివాసానికే పరిమితం కాకుండా, ప్రభుత్వ మరియు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా 'ప్రజా భవన్'ను కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు. సుమారు 25 వేల చదరపు గజాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ భవనం చుట్టూ అత్యధిక భాగం పచ్చదనానికి (గార్డెన్) కేటాయించారు. అత్యాధునిక సాంకేతికతతో, పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో ఈ ఇంటిని ఎస్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. మంత్రి లోకేష్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తున్నారు.

రాజధానిలోని ప్రధాన రహదారి అయిన E6 రోడ్డుకు అనుసంధానంగా ఈ నివాసం ఉంది. సచివాలయం వెనుక భాగం నుంచి ప్రారంభమయ్యే ఈ 9.84 కిలోమీటర్ల రహదారి రాజధాని అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తోంది. గతంలో కురువలు పట్టిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఐసిటి కేబుల్స్, గ్యాస్ పైప్‌లైన్లు వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి నివాసానికి తోడుగా మంత్రి నారాయణ కూడా సమీపంలోనే తన ఇంటి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారు.

స్థానిక రైతులు ఈ అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడి గ్రామానికి చెందిన రైతుల నుంచి ఎంతో పారదర్శకంగా స్థలాన్ని కొనుగోలు చేసి, ఈ ఇంటిని నిర్మిస్తుండటం తమ ప్రాంతానికి గర్వకారణమని వారు చెబుతున్నారు. ఒకప్పుడు స్మశానంలా, అడవిలా ఉందన్న విమర్శలను పక్కన పెట్టి, నేడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయి అభివృద్ధి ఇక్కడ కనిపిస్తోందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు.

అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఫలాలను ఇచ్చే ఒక బంగారు బాతు వంటిదని రైతులు అభివర్ణిస్తున్నారు. 2027 చివరి నాటికి రాజధాని పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. చంద్రబాబు నివాసం ప్రారంభమైతే రాజధాని ప్రాంతంలో మరింత చైతన్యం వస్తుందని, అమరావతి విశ్వనగరంగా ఎదుగుతుందనే నమ్మకాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →