గుడ్ న్యూస్.. మరో నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు! దేశవ్యాప్తంగా 164కి చేరిన సర్వీసులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైద్య రంగంలో మరో అద్భుతమైన శుభవార్త లభించింది. ఇకపై క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రంలోనే ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.4,260 కోట్ల వ్యయంతో “చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్”ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సెంటర్‌ను దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం, చల్లా గ్రూప్, ఒమెక్సా బయాలజీస్, మేస్ మరియు ఐ హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.!

విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం ఛైర్మన్ పీటర్ చున్, చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం 25 ఎకరాల విస్తీర్ణంలో 1,500 పడకల ఆసుపత్రి, మెడికల్ స్కూల్, హెల్త్ టెక్నాలజీ సెంటర్, క్యాన్సర్ మ్యూజియం, హెలిపోర్ట్, హోటల్, నివాస సముదాయాలు, పార్కులు మరియు బొటానికల్ గార్డెన్ వంటి అత్యాధునిక సదుపాయాలు నిర్మించనున్నారు.

Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50!

ఈ స్మార్ట్ మెడికల్ సిటీ ప్రాజెక్టు ద్వారా కేవలం చికిత్సే కాకుండా, క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే ఆధునిక నిర్ధారణ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఒమెక్సా కో-ఫౌండర్ డాక్టర్ రాజన్ గార్గ్ మాట్లాడుతూ, పేదలకు ఉచితంగా ఆపరేషన్లు, చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఈ సెంటర్ ద్వారా లబ్ధి పొందనున్నారు. దాదాపు నాలుగు వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు ద్వారా లభిస్తాయని అంచనా.

MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం!

చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ మాట్లాడుతూ, తన స్వస్థలమైన ప్రకాశం జిల్లాలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో మరికొన్ని పరిశ్రమలు, ప్రాజెక్టులు కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. పీటర్ చున్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వైద్య రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. అనుమతులు రాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

40 గంటల మ్యూజిక్ నాన్‌స్టాప్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో లావా నెక్ బ్యాండ్!

ఇప్పటికే రాష్ట్రంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో, ఈ అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం మరింత బలపడనుంది. ఇకపై రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా తమ స్వస్థలంలోనే అధునాతన చికిత్సలు పొందే అవకాశం లభించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, దొనకొండ ఆంధ్రప్రదేశ్ వైద్య మ్యాప్‌లో ఒక ప్రధాన కేంద్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!!
యూఏఈ నివాసితులకు గుడ్‌న్యూస్.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో యూఏఈ కొత్త అడుగు! బుర్జ్ ఖలీఫా వేదికగా..
రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్! ప్రజావేదికలో...
TTd: ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం.. 1985లో ప్రారంభమైన ప్రత్యేక దర్శనం!
Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి!