Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష!

Vizag Investments: విశాఖను ఐటీ క్యాపిటల్ చేస్తాం.. 99 పైసల భూకేటాయింపులపై మంత్రి లోకేష్ పవర్‌ఫుల్ కౌంటర్!

AP Council 99 Paisa Land Issue: విశాఖలో కంపెనీలకు భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఐదు ప్రముఖ కంపెనీలకు భూములిచ్చామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేయగా, వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు..

Published : 2026-02-12 12:57:00
  • Nara Lokesh Speech: శాసనమండలిలో లోకేష్ వర్సెస్ వైసీపీ..
     
  • 99 పైసల భూముల వెనుక అసలు కథ!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా విశాఖపట్నంలో కంపెనీలకు భూముల కేటాయింపు అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. విశాఖను ఐటీ హబ్‌గా మార్చే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మంత్రి నారా లోకేష్  స్పష్టంగా వివరించగా భూముల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ సభ్యులు ఆరోపించారు.

99 పైసలకే భూములు.. మంత్రి లోకేష్ క్లారిటీ
విశాఖలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేవలం ఐదు ప్రముఖ కంపెనీలకు మాత్రమే 99 పైసలకే భూములిచ్చామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరిశ్రమలు రావాలంటే భూములివ్వడం తప్పనిసరి. క్రెడిబిలిటీ  ఉన్న సంస్థలకే భూములిచ్చాం. ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాతే ఈ ప్రక్రియ జరిగింది అని  వెల్లడించారు. దేశానికి వచ్చే ప్రతి 100 రూపాయల పెట్టుబడిలో 26 రూపాయలు ఏపీకే వస్తోందని, ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌లో తక్కువ ధరకే భూములిచ్చారు కాబట్టే, నేడు అది ఐటీలో అగ్రస్థానంలో ఉందని, విశాఖను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

రహేజాకు భూములకు ఘాటైన సమాధానం.
వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు జోక్యం చేసుకుంటూ.. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన రహేజాకు భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనికి బొత్స సత్యనారాయణ మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, రహేజా బిల్డింగ్స్‌లో అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయని, దానివల్ల వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. సంబంధం లేని ప్రశ్నలతో సభను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.

వైసీపీపై లోకేష్ నిప్పులు
వైసీపీ హయాంలో ఒక్క కంపెనీనైనా రాష్ట్రానికి తీసుకొచ్చారా? అని మంత్రి లోకేష్ నిలదీశారు. 2019-24 మధ్య పెట్టుబడిదారులను వేధించి తరిమేశారు. ఇప్పుడు మేము టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను తెస్తుంటే అడ్డుకుంటున్నారు. ఏపీకి పరిశ్రమలు రాకూడదని వైసీపీ కంకణం కట్టుకుంది అని మండిపడ్డారు. ఉర్సా కంపెనీకి భూములిచ్చామని నిరూపించగలరా అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి సవాల్ విసిరారు. సమాధానం వినే ఓపిక లేక ప్రతిపక్షం గందరగోళం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.

ఉత్తరాంధ్రకు ఆర్సిలర్ మిట్టల్
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఆర్సిలర్ మిట్టల్ ప్రాజెక్ట్ ఇక్కడికి రాబోతోందని మంత్రి లోకేష్ ప్రకటించారు. విశాఖను ఐటీ క్యాపిటల్ చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.

Spotlight

Read More →